త్వరలోనే లీటర్ పెట్రోల్ రూ.5, లీటర్ డీజిల్‌పై రూ.3 పెంపు

పెట్రో బాదుడుకు సిద్ధంగా ఉండండి.. త్వరలోనే పెట్రోల్ ధరలను పెంచేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకపు విలువ క్షీణిస్తుండటం, గడచిన ఐదు నెలలు పెట్రోల్ ధరలను పెంచకపోవడంతో, ఇటు చమురు కంపెనీలు అటు ప్రభుత్వం ధరల పెంపుకు సిద్ధమవుతోంది. మే 22న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తక్షణమే పెట్రోల్ ధరల పెంపుపై ఓ స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడి చమురు ధరలు, దానికితోడు దేశీయ మార్కెట్లో సబ్సిడి ధరకే పెట్రోల్‌ను విక్రయిస్తుండటంతో చమురు కంపెనీలు ప్రతి లీటరు పెట్రోలో విక్రయంపై రూ.8 వరకూ నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో, పెట్రోల్‌ను సబ్సిడి ధరకు విక్రయించడం వలన కలిగిన నష్టాలను భర్తీ చేయాల్సిందిగా చమురు కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తుండటంతో త్వరలోనే వీటి ధరలను సవరించాలని సర్కారు యోచిస్తోంది. ఇదే గనుక జరిగితే లీటరు పెట్రోల్‌పై కనీసం రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున ధర పెరిగే అవకాశం ఉంది.

పెట్రోల్ ధరల పెంపుపై రాజ్య సభలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పందిస్తూ.. పెట్రోల్ ధరలు హద్దులు లేకుండా పెరిగిపోతున్నాయని, వాటిని అదుపులో పెట్టడం కష్టమని, సరైన దిద్దుబాటు చర్యలు తీసుకోకపోయినట్లయితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. అయితే, వాత పెట్టి వెన్న పూసిన చందంగా, మొత్తం భారాన్ని వినియోగదారులపై మోపబోమని, అందులో కొంత భారాన్ని మాత్రమే వారిపైకి బదిలీ చేస్తామని చెప్పారు.

More from DriveSpark

Article Published On: Thursday, May 17, 2012, 16:00 [IST]
English summary
Petrol prices set to go up again. Oil companies likely to hike the petrol price by Rs 5/litre, diesel at Rs 3/litre soon after Parliament's budget session ends on May 22.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+