తక్షణమే పెట్రోల్ ధరలు పెంచాలి: ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు

అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు ఆకాశాన్నంటడంతో దేశీయ మార్కెట్లో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రతి లీటరు పెట్రోల్ విక్రయంపై రూ. 3.56 చొప్పున నష్టపోతున్న నేపథ్యంలో వెంటనే పెట్రోల్ ధరలను పెంచాలని చమురు కంపెనీ డిమాండ్ చేస్తున్నాయి. అయితే, వెంటనే పెట్రోల్ ధరలు పెంచడానికి ప్రభుత్వం తమకు అనుమతినిస్తుందో లేదోనని వారు సంశయం వ్యక్తం చేస్తున్నారు.

గడచిన 15 రోజులుగా గమనిస్తే, సింగపూర్ మార్కెట్ రేట్ల ప్రకారం పెట్రోల్‌పై లీటరుకు రూ. 1.37 చొప్పున నష్టాలు వాటిల్లాయని, ప్రస్తుతం ఈ నెలలో ఇది రూ. 3.56కి పెరిగిందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ చైర్మన్ ఆర్‌ఎస్ బుటోలా తెలిపారు. జులై 24న ప్రభుత్వ రంగ చమురు కంపెనీ లీటర్ పెట్రోల్‌పై 70 పైసల చొప్పున పెంపును విధించిన సంగతి తెలిసిందే.

జులై 2010లో పెట్రోల్ ధరలపై ప్రభుత్వం తమ నియంత్రణలను తొలగిస్తూ, వీటి నిర్ణయాధికారాన్ని ప్రభుత్వ రంగ పెట్రోల్ కంపెనీల చేతికి అప్పగించింది. అప్పటి నుంచి పలుమార్లు పెట్రోల్ ధరలు పెరుగుతూ రావటం జరిగుతోంది. అయినప్పటికీ, చమురు కంపెనీలు పెట్రోల్ ధరలను పెంచాలంటే ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరల నియంత్రణను తిరిగి ప్రభుత్వమే చేపట్టాలని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ అభిప్రాయ పడుతోంది. దీని గురించి బుటోలా మాట్లాడుతూ.. పెట్రోల్ ధరలపై నియంత్రణ ఎత్తివేసి ప్రభుత్వమే అజమాయిషీ చేసినట్లయితే, కనీసం పరిహారమైనా లభిస్తుందని చమురు కంపెనీలు భావిస్తున్నాయని ఆయన చెప్పారు.

More from DriveSpark

Article Published On: Friday, August 10, 2012, 10:56 [IST]
English summary
With losses widening to Rs 3.56 per litre, public sector oil firms sought an immediate hike in petrol price but were unsure if the government will allow them to do so.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+