పెంగ్విన్ మస్కట్గా హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ రెండు కంపెనీలు కూడా విభిన్న విభాగాల్లో ప్రత్యేక మైలురాళ్లను అధిగమించాయి. హిందూస్థాన్ మోటార్స్ ఫ్లాగ్షిప్ సెడాన్ అంబాసిడర్ను ఈ వేడుకలం పెంగ్విన్ ఇండియా ప్రత్యేకంగా ముస్తాబు చేసి దేశవ్యాప్తంగా ప్రచారం సాగించనుంది.
ఈ కారును పెంగ్విన్కు అత్యంత ప్రాచుర్యమైన తెలుపు, నారింజ రంగుల కలయికతో కారును పెయింట్ చేసి దానిపై 25 లోగోను ముద్రించింది. అంతేకాకుండా ఇంటీరియర్స్లో ప్రీమియం లుక్నిచ్చే విధంగా లెథర్ సీట్లతో డిజైన్ చేశారు. ఈ మస్కట్లో ఈ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేకంగా ప్రచురించిన పుస్తకాల క్రమం స్పెషల్ పాపులర్ పెంగ్విన్స్లను కూడా ఇందులో ఉంచారు.
ఈ అంబాసిడర్ కారు దేశవ్యాప్తంగా ఉన్న పుస్తకాల స్టోర్లను సందర్శించి, జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ వంటి పండుగలను జరుపుకోనుంది. ఫిబ్రవరి 25న ఢిల్లీలో జరగునున్న వరల్డ్ బుక్ ఫెయిర్లో కూడా ఈ పెంగ్విన్ అంబాసిడర్ కారు దర్శనమివ్వనుంది.


Click it and Unblock the Notifications









