పెట్రోల్‌ ధర పెంపుకు మాకు సంబంధం లేదు: ప్రణబ్

గతంలో ఇది వరకెన్నడూ లేని విధంగా, పెట్రోలు ధరను లీటరుకు రూ.7.50 పెంచిన నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ధరల పెంపుపై వ్యాఖ్యానిస్తూ.. పెట్రోల్ ధరలకు పెంపుకు తమకు (ప్రభుత్వానికి) ఎలాంటి సంబంధం లేదని, గడచిన రెండేళ్ల క్రితమే పెట్రోల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణలు ఎత్తివేశామని తెలిపారు. పెట్రోల్ ధరలను తగ్గించటం, పెంచటం చమురు కంపెనీల అధీనంలోనే ఉందని, తమ చేతుల్లో ఏమీ లేదని చెప్పుకొచ్చారు.

బుధవారం అర్థరాత్రి నుండి పెట్రోల్ ధరను లీటరుకు రూ.7.50 చొప్పను పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా ఇంత భారీ మొత్తంలో పెట్రోల్ ధరలు పెంచటం గురించి విలేఖరులు ప్రణబ్ ముఖర్జీని ప్రశ్నించగా.. సుమారు రెండేళ్ల క్రితమే పెట్రోల్ ధరలపై ప్రభుత్వం తమ నియంత్రణలు ఎత్తి వేసిందని, తాజా పెంపును చమురు కంపెనీలే నిర్ణయించాయని ఆయన పేర్కొన్నారు. జూన్ 2010లో ప్రభుత్వం పెట్రోలుపై ధరల నియంత్రణను ఎత్తివేసింది.

చమురు కంపెనీలు చివరిగా పెట్రోల్ ధరలను నవంబర్ 4, 2011లో పెంచాయి. ఆ తర్వాత ఐదు రాష్ట్రాల్లోని కీలక అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పెట్రోల్ ధరలను పెంచకండని, నష్టాలను తామే భరిస్తామని ప్రభుత్వం చమురు కంపెనీలకు హామీ ఇచ్చింది. దీంతో అప్పటి నుండి పెట్రోల్ ధరలు పెరగలేదు. అయితే, సదరు ఎన్నికల్లో సర్కారుకు అనుకూలంగా ఫలితాలు రాకపోవడంతో, ఆ కోపాన్ని ఇలా పెట్రోల్ ధరల రూపంలో ప్రజలపై చూపిస్తోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, May 24, 2012, 12:57 [IST]
English summary
Finance minister Pranab Mukherjee on Wednesday said the decision to increase petrol price by a massive Rs 7.54 a litre was taken by oil marketing companies as the government had deregulated the fuel nearly two years ago.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+