త్వరలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

పెట్రోల్, డీజిల్ ధరలకు మరోసారి రెక్కలు రానున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో లీటర్ పెట్రోల్ ధర రూ.4, లీటర్ డీజిల్ ధర రూ.2 మేర పెరిగే అవకాశం ఉంది. ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న అత్యంత కీలక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల మొదటి వారంతో ముగియనుండటంతో ఇటు ప్రభుత్వం, అటు చమురు కంపెనీలు ధరలను పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఈ ఎన్నికల కారణంగా గత కొద్ది రోజులుగా ధరలను పెంచని చమురు కంపెనీలు అనువైన సమయం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. ఈ ఎన్నికలు ముగిసే వరకూ వరకూ పెట్రోల్ ధరల జోలికి వెళ్లొద్దని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు గడచిన రెండు నెలలుగా చమురు కంపెనీలు పెట్రోల్ ధరలను సవరించలేదు.

దీంతో అంతర్జాతీయ మార్కెట్లో అధిక కొనుగోలు చేసిన పెట్రోల్, డీజిల్‌ను భారత మార్కెట్లో సబ్సిడికే విక్రయిస్తుండటంతో చమురు కంపెనీలు నష్టపోతున్నాయి. అయితే, ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఎన్నికల కౌంటింగ్ అయ్యే వరకూ ఇంధన ధరలు పెరిగే ఆస్కారం ఉండకపోవచ్చనే వాదన కూడా ఉంది.

అయితే, ధరల పెంపు కోసం చమురు కంపెనీలు ప్రభుత్వంపై వత్తిడి తీసుకు వస్తున్న తరుణంలో ఈ వాదనకు అంత బలం చేకూరే అవకాశం కనిపించడం లేదు. మొత్తమ్మీద ఈ సారి పెట్రోల్ ధరలు వినియోగదారుల జేబులకు చిల్లులు పెట్టడటం ఖాయమని తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, February 27, 2012, 17:18 [IST]
English summary
It seems that there is no respite for Indians, once again they are likely to be hit by another petrol and diesel price hike, informed sources on Monday, Feb 27. According to sources, Petrol price to rise at Rs 4/litre, diesel at Rs 2/litre.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+