లీటర్పై రూ.1.60 మేర దిగిరానున్న పెట్రోల్ ధర

ఈ నేపథ్యంలో, ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలకు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ, బలపడిన రూపాయి విలువ కారణంగా, అక్టోబర్ 1, 2012 నుంచి లీటర్ పెట్రోల్ అమ్మకంపై రూ.1.60 మేర లాభం వస్తోందని, ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే త్వరలోనే పెట్రోల్ ధర తగ్గవచ్చని చెప్పారు. ఆగస్టు రెండవ వారంలో డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకపు విలువ రూ.55.58 నుంచి గత పక్షం రోజుల క్రితం 54.12కు స్థాయికి చేరింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 126.11 డాలర్ల నుంచి 122.31 డాలర్లకు తగ్గింది.
కాగా.. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ ఏడాది జూన్ 3న లీటర్ పెట్రోల్ ధరను రూ.2.02 చొప్పున పెంచగా, తిరిగి జూలై 24న 70 పైసల చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చమురు కంపెనీలు పెట్రోల్ విక్రయంపై లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ.. డీజిల్, కిరోసిన్, ఎల్పిజి విక్రయాలపై మాత్రం భారీగా నష్టపోతున్నాయి. సబ్సిడి ధరలకే వీటిని విక్రయిస్తుండటం వలన లీటర్ డీజిల్ అమ్మకంపై రూ.12, లీటర్ కిరోసిన్ అమ్మకంపై రూ.35.63, 14.2 కేజీల ఎల్పిజి సిలిండర్పై రూ.468.50 చొప్పున చమురు కంపెనీలు నష్టపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,76,937 కోట్ల నష్టం వస్తుందని చమురు సంస్థలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications








