పెట్రోల్ ధర పెంపు ఎఫెక్ట్: తక్కువ ధరకే పెట్రోల్ కార్లు
ప్రధానంగా పెట్రోల్ కార్ల ఉత్పత్తినే ఆధారపడిన మారుతి సుజుకి, హోండా మోటార్స్, హ్యుందాయ్ వంటి కంపెనీలు ఈ తాజా పెంపు తీవ్ర ఇబ్బందులను కలిగించనుంది. ఈ నేపథ్యంలో, కార్ కంపెనీలు పెట్రోల్ మోడళ్లపై సుమారు రూ50,000 వరకూ తగ్గింపులను అందించడమే కాకుండా.. కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ స్కీమ్లను కూడా ఆఫర్ చేస్తున్నారు.
మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న కొన్ని రకాల పెట్రోల్ కార్లపై సుమారు రూ.30,000 వరకూ తగ్గింపులను అందిస్తుండగా, టాటా మోటార్స్ అందిస్తున్న ఇండిగో రేంజ్ పెట్రోల్ కార్లపై రూ.10,000 నుండి రూ.50,000 వరకూ డిస్కౌంట్స్ను కంపెనీ ఆఫర్ చేస్తుంది. అలాగే, టాటా నానో కారుపై కూడా రూ.10,000 తగ్గింపును కంపెనీ అందిస్తోంది. మరో వైపు కొనుగోలుదారులపై పెట్రో భారాన్ని తగ్గించేందుకు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పటికే పెట్రోల్ కార్ల కొనుగోలుపై తగ్గింపులతో కూడిన ఓ ప్రత్యేక స్కీమ్ను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఒకవేళ డీలర్లు పెట్రోల్ కార్లపై ఎలాంటి డిస్కౌంట్లను ఆఫర్ చేయకపోయినా బేరమాడే అవకాశం కస్టమర్లకు ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే.. పెట్రోల్ కార్ల ధరలు పెరిగిన విషయాన్ని అటుంచితే, తక్కువ ధరకే పెట్రోల్ కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం అని చెప్పవచ్చు. మరి మీరు కూడా పెట్రోల్ కారునే కొనుగోలు చేయాలని నిశ్చయించుకున్నట్లయితే, ఇంతకు మించిన మంచి తరుణం మరొకటి లేదనే చెప్పాలి.. మీరేమంటారు...?


Click it and Unblock the Notifications









