లీటరు పెట్రోల్పై రూ.7.50 పెంపు, అర్థరాత్రి నుండే అమలు
బలహీన పడుతున్న రూపాయి విలువను పరిగణలోకి తీసుకుని తక్షణమే పెట్రోల్ ధరలను పెంచాల్సిన అవసరం ఉందని చమురు శాఖా మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి మంగళవారం వ్యాఖ్యానించి తర్వాత రోజునే పెట్రోల్ ధరలు పెరగటం గమనార్హం. గడచిన జూన్ 2010లో పెట్రోల్ ధరలపై తమ నియంత్రణలు తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల కీలక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్ ధరలను పెంచవద్దని ప్రభుత్వం చమురు కంపెనీలను కోరింది. దీంతో అప్పటి నుండి చమురు కంపెనీలు పెట్రోల్ ధరలను పెంచలేదు.
పెట్రోల్ ధరను సబ్సిడి ధరకే విక్రయిస్తుండటం, రూపాయి మారకపు విలువలో ఎంత మాత్రం మార్పు రాకపోవడంతో ఇక చేసేదే ఏమీ లేక పెట్రో భారాన్ని సాధారణ ప్రజలపై మోపేందుకు సర్కారు నడుం బిగించింది. పెట్రలో ధరలు ఒక్కసారిగా ఇంత అత్యధికంగా పెరగటం ఇదే మొదటి సారి. వ్యాట్ లేకుండా పెట్రోల్ ధర పెంపు రూ.6.28 గా ఉంది. దీనికి వ్యాట్ కలుపుకుంటే రూ.7.50 అవుతుంది (ఢిల్లీలో). ప్రస్తుతం ఢిల్లీలో రూ.65.64 లుగా ఉన్న లీటర్ పెట్రోల్ ధర ఈ రోజు అర్థరాత్రి నుండి రూ.73.14 లకు పెరగనుంది.


Click it and Unblock the Notifications









