పెట్రోల్ ధరను రూ.5 పెంచండి: చమురు కంపెనీలు

మీ వాహనాలను ఇప్పుడే ఫుల్ ట్యాంక్ చేయించుకోవటం మంచిది. ఎందుకంటే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎక్కడా కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఫలితాలు రాకపోవడంతో ప్రభుత్వం ప్రజలపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చమురు కంపెనీలు లీటరు పెట్రోల్ విక్రయంపై రూ.5.10 నష్టపోతున్నాయి.

దీంతో వీలైనంత త్వరగా పెట్రోల్ ధరలను పెంచాలని చమురు కంపెనీలు ప్రభుత్వంపై వత్తిడి తీసుకు వస్తున్నాయి. చమురు కంపెనీల ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే, లీటర్ పెట్రోల్‌ ధర రూ.5 మేర పెరిగే అవకాశం ఉంది. ఉత్తర ప్రదేశ్‌తో పాటుగా మొత్తం ఐదు రాష్ట్రాలలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల లెక్కింపు పూర్తవడంతో ధరల పెంపుకు చమురు కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి.

ప్రభుత్వం కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్ ధరలను పెంచవద్దని గతంలో ప్రభుత్వం చమురు కంపెనీలను ఆదేశించింది. దీంతో చమురు కంపెనీలు గడచిన డిసెంబర్ నెల నుండి పెట్రోల్ ధరలను సవరించలేదు. వాస్తవానికి పెట్రోల్ ధరలను పెంచే స్వతంత్ర్యత చమురు కంపెనీలకు ఉన్నప్పటికీ, ఈ కీలక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం చమురు కంపెనీల నోరు మూయించింది. దీనివల్లనే ఇప్పుడు ఒక్కసారిగా వినియోగదారులపై రూ.5 భారం పడనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 7, 2012, 12:18 [IST]
English summary
With election in five states coming to an end, state-owned oil companies are pushing for raising petrol price by over Rs 5 per litre but the actual increase would depend on the government nod. "We are losing Rs 5.10 per litre on petrol currently," a senior oil company official said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+