పోర్షే కెయిన్నే ఎస్యూవీ హెడ్లైట్స్ సమస్య: రీకాల్
జర్మనీకు చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ పోర్షే అందిస్తున్న అత్యంత ప్రాచుర్యం పొందిన లగ్జరీ ఎస్యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) పోర్షే కెయిన్నేను ప్రపంచవ్యాప్తంగా రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. హెడ్లైట్లో తలెత్తున్న సమస్యల కారణంగా ఈ కార్లను వెనక్కు పలిపిస్తున్నామని ఇండియాలో విక్రయించిన మోడళ్లు కూడా ఈ రీకాల్కు వర్తిస్తాయని కంపెనీ తెలిపింది.
ఇండియాలో విక్రయించిన మొత్తం 483 కెయిన్నే ఎస్యూవీలు ఈ రీకాల్కు వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. హెడ్లైట్ లాకింగ్ మెకానిజంలో లోపం కారణంగా కంపెనీ ఈ రీకాల్ను ప్రకటించింది. భారత మార్కెట్లో పోర్షే కెయిన్నే ఐదు వెర్షన్లలో లభ్యమవుతుంది. కెయిన్నే, కెయిన్నే డీజిల్, కెయిన్నే ఎస్, కెయిన్నే ఎస్ హైబ్రిడ్, కెయిన్నే టర్బో వెర్షన్లలో ఇది లభిస్తుంది. భారత మార్కెట్లో వీటి ఎక్స్-షోరూమ్ ధరలు ఈవిధంగా ఉన్నాయి.
* పోర్షే కెయిన్నే - రూ.6,717,000/-
* పోర్షే కెయిన్నే డీజిల్ - రూ.6,499,000/-
* పోర్షే కెయిన్నే ఎస్ - రూ.7,930,000/-
* పోర్షే కెయిన్నే ఎస్ హైబ్రిడ్ - రూ.7,597,000/-
* పోర్షే కెయిన్నే టర్బో - రూ.12,817,000/-


Click it and Unblock the Notifications









