వెంటో కారు అగ్నిప్రమాదంలో గాయపడిన డ్రైవర్ మృతి

ఈ సంఘటను అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి గుప్తాను రక్షించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కారులో కూర్చున్న కైలాష్ సీట్ బెల్ట్ పెట్టుకోటం కారణంగా మంటలు చెలరేగిన సమయంలో కారులో నుండి వెలుపలకి రావటానికి ఇబ్బంది ఎదుర్కోవలసి వచ్చింది. కాలిపోయిన కారు ఫోక్స్వ్యాగన్ వెంటో 1.6 టిడిఐ డీజిల్ ఇంజన్ కారుగా గుర్తించాయి. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇంతవరకూ ఎలాంటి ప్రధాన కారణాలు తెలియరాలేదు.
ఇందుకు ఇందులో ఉపయోగించిన లోపపూరితమైన ఇంజన్ కారణమై ఉండొచ్చనే ఉద్దేశంతో ఈ సంఘటనపై ఫోక్స్వ్యాగన్ నిపుణులు విచారణ జరుపుతున్నారు. గడచిన శనివారం ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో కూడా ఇదే విధంగా మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో ఆ కారులో ప్రయాణిస్తున్న 52-ఏళ్ల పవన్ కుమార్ గుప్తా మృతి చెందిన సంగతి తెలిసిందే.
గుప్తా కారును స్టార్ట్ చేయగానే ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం, దాంతో కారులోని సెంట్రల్ లాకింగ్ యాక్టివేట్ కావడం డోర్లు, అద్దాలు లాక్ అయిపోవడం వలన ఆయన కారులోనే చిక్కుకుపోయి, కాలిన గాయాల కారణంగా మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణం ఇంజన్ అయి ఉంటుందనే ఉద్దేశ్యంతో, నిపుణుల బృందం ఆ మేరకు దర్యాప్తు చేపట్టింది.


Click it and Unblock the Notifications








