కారులో షిమ్లాలోకి ప్రవేశిస్తే రూ.200 అదనపు పన్ను!
మండు వేసవిలో కాస్తంత చల్లదనం కోరుకుంటూ మీ కారులో షిమ్లాలోకి ప్రవేశించాలనుకుంటే మీ ప్రయాణ ఖర్చుల కన్నా అదనంగా 200 రూపాయలు మీ వెంట తీసుకువెళ్లాలి. ఎందుకంటే బయటి రాష్ట్రాల నుండి షిమ్లా లోనికి ప్రవేశించి అన్ని రకాల వాహనాలపై రూ.200 ప్రవేశ సుంఖాన్ని వసూలు చేయాలని షిమ్లా మున్సిపల్ కార్పోరేషన్ నిర్ణయించింది.
హిమాచల్ ప్రదేశ్లో రిజిస్టర్ అయిన వాహనాలు కాకుండా వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిగత, వాణిజ్య వాహనాలపై షిమ్లా ఎంట్రీ పాయింట్ల వద్ద 200 రూపాయలు వసూలు చేయనున్నారు. అలాగే ద్విచక్ర వాహనాలపై రూ.100లు, బస్సులపై రూ.500ల ప్రవేశ సుంఖాన్ని వసూలు చేయనున్నారు. ఏప్రిల్ 1 నుండి షిమ్లా మున్సిపల్ కార్పోరేషన్ ఈ సుంఖాలను వసూలు చేయనుంది.
దీని ద్వారా షిమ్లా మున్సిపల్ కార్పోరేషన్కు సంవత్సరానికి రూ.6 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా. ఈ విధంగా వచ్చిన నిధులను పర్యాటకుల కోసం మౌళిక సదుపాయాలను కల్పించడానికే ఖర్చు చేస్తామని మేయర్ మధు సూద్ అన్నారు.


Click it and Unblock the Notifications









