అందాల భామలకు అందమైన కానుకలివ్వనున్న స్కొడా
ఇటీవల నిర్వహించిన పాంటలూన్స్ ఫెమినా మిస్ ఇండియా (పిఎఫ్ఎమ్ఐ) 2012 ఫైనల్ కాంటెస్ట్లో విజేతలుగా నిలిచిన ముగ్గురు ముద్దు గుమ్మలకు స్కొడా తమ బుజ్జి కారు ఫ్యాబియాను బహుమతిగా ఇచ్చింది. ఈ కార్యక్రమానికి అధికారిక కార్ పార్ట్నర్గా స్కొడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ కాంటెస్ట్లో గెలిచిన విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.
* వన్యా మిశ్రా - పాంటలూన్స్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2012
* ప్రాచి మిశ్రా - పాంటలూన్స్ ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2012
* రోచెల్లి మిశ్రా రావ్ - పాంటలూన్స్ ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2012
ఈ ముగ్గురు ముద్దుగుమ్మలకు స్కొడా తమ ఫ్యాబియా కార్లను బహుమతిగా అందజేసింది. గడచిన సంవత్సరం నిర్వహించిన పాంటలూన్స్ ఫెమినా మిస్ ఇండియా (పిఎఫ్ఎమ్ఐ) 2011లో కనిష్టా ధనకర్ పాంటలూన్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2011 కిరీటాన్ని దక్కించుకోగా.. అంకితా షోరే మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2011 కిరీటాన్ని, అలాగే హస్లీన్ కౌర్ మిస్ ఇండియా ఎర్త్ 2011 కిరీటాలను సొంతం చేసుకున్నారు.


Click it and Unblock the Notifications









