నానోతో సహా అన్ని కార్ల ధరలను పెంచిన టాటా మోటార్స్
ప్యాసింజర్ కార్ల విభాగంలో టాటా మోటార్స్ అందిస్తున్న టాటా నానో, ఇండికా, ఇండిగో వంటి వివిధ మోడళ్ల ధరలు రూ.2,000/- నుండి రూ.8,000/- వరకూ పెరగనున్నాయి. అలాగే, యుటిలిటీ వాహన విభాగంలో కంపెనీ అందిస్తున్న సఫారీ, ఆరియా, సుమో వంటి మోడళ్ల ధరలు రూ.8,000/- నుండి రూ.35,000/- వరకూ పెరగనున్నాయి. అయితే, ఖచ్ఛితంగా ఏయే మోడళ్లపై ఎంత ధర పెంచుతున్నామనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
వాణిజ్య వాహనాల విషయంలో కూడా కొంత భారాన్ని వినియోగదారులపై మోపాలని భావిస్తున్నామని, ఈ విభాగంలో తమకు విస్తృత స్థాయిలో ఉత్పత్తులు ఉన్నాయని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ వాహనాలపై 2 శాతం మేర ధరలు పెరగనున్నాయి. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ 2012-13లో చిన్న కార్లపై ఎక్సైజ్ సుంఖాన్ని 10 శాతం నుండి 12 శాతానికి, పెద్ద కార్లపై సుంఖాన్ని 22 శాతం నుండి 27 శాతానికి, దిగుమతి చేసుకున్న వాహనాలపై కస్టమ్ డ్యూటీని 60 శాతం నుండి 75 శాతానికి పెంచడం జరిగింది.


Click it and Unblock the Notifications









