రేపే మహీంద్రా ఎక్స్యూవీ500 లక్కీ డ్రా విజేతల వెల్లడి
ఈ నేపథ్యంలో లక్కీ డ్రా ఫలితాలు రేపు (ఫిబ్రవరి 15, 2012) సాయంత్రం 5 గంటలకు వెల్లడిస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. సెకండ్ ఫేజ్ బుకింగ్స్లో భాగంగా, ఈసారి మొత్తం 19 నగరాల్లో కంపెనీ బుకింగ్లను ప్రారంభించింది, ఇందులో సుమారు 25,000 యూనిట్లకు పైగా ఆర్డర్లు రావటం జరిగింది. ఈ లక్కీ డ్రాను ప్రముఖ వృత్తి సేవల సంస్థ డెలాయిట్ టచ్ తోహ్మత్సు ఇండియా ప్రై లి (డిటిటిఐపిఎల్) నిర్వహిస్తుంది.
మహీంద్రా ఎక్స్యూవీ500 వాహనాల డెలివరీలో పారదర్శకతను పాటించేందుకు మాత్రమే ఈ లక్కీ డ్రా విధానాన్ని ప్రవేశపెట్టామని ఎమ్ అండ్ ఎమ్ పేర్కొంది. సాధారణంగా మహీంద్రా ఎక్స్యూవీ500 డెలివరీ సమయం గరిష్టంగా నాలుగు నెలల వరకూ ఉంటోంది. ఈ ఎస్యూవీకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని దీని ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 3,000 యూనిట్లకు పెంచినట్లు కంపెనీ తెలిపింది.
ఏదేమైనప్పటికీ, కొత్త మహీంద్రా ఎక్స్యూవీ500 ఎస్యూవీ ఎవరిని వరిస్తుందో రేపు సాయంత్రం లోపుగా తెలిపోనుంది. లక్కీ డ్రా ఫలితాలను మహీంద్రా ఎక్స్యూవీ500 అధికారిక వెబ్సైట్లో పొందవచ్చు.


Click it and Unblock the Notifications









