సిఎన్జీతో నడిచే సిటీ బస్సులను విడుదల చేయనున్న వోల్వో

గడచిన జనవరి నెలలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్పోలో "వోల్వో 8400" సిటీ బస్సును కంపెనీ ఆవిష్కరించింది. రానున్న జులై-ఆగస్ట్ 2012 నాటికి ఇది వాణిజ్యపరంగా మార్కెట్లో లభ్యం కానుంది. అయితే, సిఎన్జీ వాయువు ఢిల్లీ, ముంబై వంటి కొన్ని ప్రధాన మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం కావడంతో దేశంలో ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఇప్పట్లో లేవు.
ఈ సిఎన్జీ బస్సులను బెంగుళూరులో ఉన్న హోస్కోట్ ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇతర బస్సులతో పోల్చుకుంటే తమ బస్సులు 20-30 శాతం మంచి కవరేజ్ను ఇస్తున్నాయని, భవిష్యత్తులో భారత్లో తమ ఇతర ఉత్పత్తుల కన్నా సిఎన్జీ బస్సుల నుండే అధిక వృద్ధి లభించగలదని ఆశిస్తున్నామని వోల్వో బస్ కార్పోరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆకాశ్ పాస్సే తెలిపారు.


Click it and Unblock the Notifications








