బెంగుళూరు రోడ్లపై పరుగులు పెట్టనున్న వోల్వో హైబ్రిడ్ బస్

105 సీట్లు కలిగిసిన ఈ సింగిల్ బస్సును నగర రోడ్లపై జనవరి నుండి రెండు నెలల పాటు ట్రైల్ నిర్వహించనున్నామని ఆయన చెప్పారు. ఇది డీజిల్ ఇంధన వ్యయాన్ని 30 శాతం వరకూ తగ్గిస్తుందని, అతి తక్కువ కర్భన వ్యర్థాలను విడుదల చేస్తుందని అశోక్ విలేఖరులరు తెలిపారు. ఇది డీజిల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్లతో నడుస్తుంది.
ఇందులో 5-లీటర్ ఎమ్డి5, ఫోర్ సిలిండర్ టర్బోఛార్జ్డ్, ఇంటర్కూల్డ్ డీజిల్ ఇంజన్ను ఉపయోగించారు. ఇది 210 బిహెచ్పిల గరిష్ట శక్తిని, 800 ఎన్ఎమ్ల గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ లిథియం అయాన్ బ్యాటరీల ద్వారా పనిచేస్తుంది. ఈ రెండు ఇంజన్లు విడివిడిగా కానీ, లేదా రెండింటినీ ఒకేసారి కానీ ఉపయోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








