మారుతి సుజుకి ప్లాంట్లో కార్మికుల గొడవ; ఒకరు మృతి
గడచిన కొద్ది నెలలుగా ప్రశాంతంగా సాగుతున్న మారుతి సుజుకి మానేసర్ ప్లాంట్లో మళ్లీ గందరగోళం నెలకొంది. ఇటీవలి కాలంలో వరుసగా జరిగిన సమ్మెలతో సతమతమైన మారుతి సుజుకి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా, తాజాగా రేగిన కలకలం కంపెనీను మరింత ఇబ్బందుల్లోకి పడేసేలా కనిపిస్తోంది.
బుధవారం మద్యాహ్నం సూపర్వైజర్లకు, కార్మికుల మధ్య ఘర్షన జరిగింది. ఈ గొడవలో తీవ్రంగా గాయపడిన ఒక కార్మికుడు మరణించగా, దాదాపు 40 మందికి పైగా కార్మికులు గాయాలపాలయ్యారు. కార్మికులకు, సూపర్వైజర్లకు మధ్య మాటా మాటా పెరిగి చివరికి గొడవకు దారి తీసింది.
ఈ తాజా గొడవతో మారుతి సుజుకి ప్లాంట్లో ఉత్పత్తి పాక్షికంగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. మార్నింగ్ షిఫ్ట్ కార్మికులు మానేసర్ ప్లాంట్ ముందు భైటాయించారు. దేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీలో తరచూ ఇలాంటి గొడవలు జరగటం మారుతి సుజుకి ప్రతిష్టపై ప్రభావాన్ని చూపడం ఖాయం. మరి తాజా సమ్మె ఎప్పట్లోగా సద్దుమణుగుంతో వేచి చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications









