Just In
- 2 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 3 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- 4 hrs ago మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- 7 hrs ago ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
Don't Miss
- News కేజ్రివాల్, కవిత కస్టడీపై ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం..!
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Movies Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
చెన్నైలో నేటి నుంచి సీట్ బెల్ట్ రూప్ తప్పనిసరి!
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో నేటి కారు నడిపే వారు సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి కానుంది. ఈ నిబంధనను అతిక్రమించన వారిపై అక్కడి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాను విధించనున్నారు. వాస్తవానికి ఈ నిబంధన గడచిన వారంలోనే అమలు కావల్సి ఉండగా, తమిళనాడు ట్రాఫిక్ పోలీసులు దీనిని మరో వారం వాయిదా వేసి, నేటి నుంచి అమల్లోకి తీసుకువచ్చేలా చేశారు.
కేవలం వాహనం నడిపే వారే కాకుండా, ఫ్రంట్ సీట్లో కూర్చునే ప్యాసింజర్లు కూడా సీట్ బెల్టులను ధరించడం తప్పనిసరి. ఈ నిబంధన టాక్సీ డ్రైవర్లు, అందులో ప్రయాణించే ప్యాసింజర్లకు కూడా వర్తిస్తుంది. ఈ అవగాహన క్యాంపైన్కు మంచి స్పందన లభిస్తోందని, మోటారిస్టులందరూ ఈ నిబంధనకు కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నామని ట్రాఫిక్ అధికారులు చెప్పారు.
సీట్ బెల్టులు ధరించకపోయినట్లయితే, అత్యవసర సమయాల్లో ప్రమాదం జరిగినప్పుడు ఫ్రంట్ సీట్లలో ఉండే డ్రైవర్, ప్యాసింజర్లకు తీవ్ర గాయాలు కావటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే ఆస్కారం కూడా ఉంటుంది.
సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్, 1989లోని సెక్షన్ 138 (3) ప్రకారం, వాహనాలు చలనంలో ఉన్నప్పుడు సీట్ బెల్టును ఉపయోగించటం తప్పనిసరి. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి మోటార్ వెహికల్ యాక్ట్, 1988లోని సెక్షన్ 177 ప్రకారం మొదటిసారి జరిమానాగా రూ.100 లను వసూలు చేస్తారు. ఆ తర్వాత కూడా ఇదే తప్పుకు పాల్పడినట్లయితే, ప్రతిసారి రూ.300ల చొప్పున జరిమానా వసూలు చేస్తారు.