Just In
- 50 min ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 2 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- 3 hrs ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- 5 hrs ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
Don't Miss
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Movies ‘సీరియల్స్లో తెలుగు వాళ్లను నీచంగా.. కన్నడ యాక్టర్ల ముందు పని వాళ్లకంటే హీనంగా’
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
భారతదేశంలో 15 ఏళ్లు నిండిన వాహనాలకి కాలం చెల్లు!?
భారతదేశంలో పాత వాహనాలకు కాలం చెల్లిపోనుంది. ఇక నుంచి ఏదైనా వాహన జీవితకాలం 15 ఏళ్లు మాత్రమే కానుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం, భారతదేశంలో 15 ఏళ్లు నిండిపోయిన వాహనాలను ఢిల్లీ రోడ్ల నుంచి తొలగించి, స్క్రాప్గా మార్చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనను భారతదేశపు ఆటోమోటివ్ పరిశ్రమ కూడా స్వాగతిస్తోంది.
దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, కాలం చెల్లిపోయిన, పాత వాహనల స్థానంలో అత్యాధునిక వాహనాలను ఉపయోగించాలనే ఆలోచన కూడా ఈ నిర్ణయానికి మరో కారణం.
భారత ఆటోమోటివ్ పరిశ్రమలోని ఓ విభాగం ప్రకారం, ఇలాంటి పాతన వాహనాలను ఢిల్లీ రోడ్లపై నుంచి తొలగించడానికి బదులుగా, వీటిని స్క్రాప్గా మార్చేయాలని, లేదంటే ఇవి పక్క రాష్ట్రాలలో రిజిస్టర్ చేసుకొని, తిరిగి ఢిల్లీ రోడ్లపై వచ్చే ఆస్కారం ఉందని సదరు విభాగం భావిస్తోంది.
ఈ విషయం గురించి భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) విష్ణు మాథుర్ ప్రస్తావిస్తూ.. మోడ్రనైజేషన్ మరియు స్క్రాపింగ్ పాలసీ కోసం తాము ధీర్ఘ కాలంగా ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నామని అన్నారు.
ఈ చర్య వలన కేవలం కాలుష్యాన్ని కలిగించే వాహనాలను తొలగించడమే కాకుండా, మార్కెట్లోకి మరింత ఎక్కువ మైలేజీనిచ్చే మరియు తక్కువ కాలుష్యాన్ని కలిగించే వాహనాలకు స్వాగతం చెప్పేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన చెప్పారు.