Just In
- 39 min ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 1 hr ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 2 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 3 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- News తెలంగాణ జెన్కో, ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Movies The Goat Life Collections ఆడుజీవితం భారీ ఓపెనింగ్స్.. పృథ్వీరాజ్ సుకుమారన్కు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బెంగుళూరులో వోల్వో బస్ సెంటర్ ప్రారంభం
స్వీడన్కు చెందిన బస్సుల తయారీ సంస్థ వోల్వో బెంగుళూరులో 'వోల్వో బస్ సెంటర్'ను ప్రారంభించింది. ఈ కేంద్రంలో వోల్వో సర్వీసులు, ప్రమాదాల నివారణ, మరమ్మతులు, వోల్వో నాణ్యమైన విడిభాగాలు, డ్రైవర్ శిక్షణ, సలహా సూచనలతో పాటు ఇతర సేవలపై పూర్తి సమాచారాన్ని ప్రయాణికులకు, వివిధ ట్రావెల్ ఏజెన్సీలకు అందించే ఏర్పాట్లు చేస్తామని కంపెనీ పేర్కొంది.
ఇటీవల కాలంలో పలు వోల్వో బస్సులు ప్రమాదాలకు గురవుతుండటం మరియు సదరు బస్సులలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తడంతో ఈ ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించామని వోల్వో వివరించింది. ఈ వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతోపాటు సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు వోల్వో సేవలపై ఆధారపడటం తెలిసినదే.
జిగనీ లింక్రోడ్డ్ సమీపలోని బొమ్మసంద్ర కర్ణాటక పారిశ్రామికాభివృద్ధి మండలి పరిశ్రమల కేంద్రంలో ఈ వోల్వో బస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. మొత్తం 43,000 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో 16 బేలు ఉంటాయి. ఈ కేంద్రంలో ప్రతీరోజూ సుమారు 15 నుండి 20 వోల్వో సర్వీసులుపై పూర్తి వివరాలు అందిస్తూ, బెంగుళూరుకు సమీపంలోని వివిధ ప్రధాన రూట్లలో సేవలు అందుబాటులో ఉంటాయి.
ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా, పాలెం వద్ద చోటు చేసుకున్న ఘోర ప్రమాద వోల్వో బ్ససు ప్రమాద సంఘటన అనంతరం వోల్వో బస్సుల నిర్వహణపై తలెత్తిన వివాదాలు, విమర్శలు, సీఐడీ బృందం రూపొందించిన నివేదికలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ వోల్వో సంస్థ ఈ ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది.