Just In
- 4 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 7 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 9 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 13 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
2017 నాటికి రానున్న అశోక్ లేలాండ్ ఎలక్ట్రిక్ బస్ 'వెర్సా'
హిందూజా గ్రూపుకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం అశోక్ లేలాండ్, 2017 నాటికి 'వెర్సా' అనే ఎలక్ట్రిక్ బస్సును భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించింది. ఈ మేరకు గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 4వ బస్ అండ్ స్పెషల్ వెహికల్ ఎక్స్పోలో అశోక్ లేలాండ్ తమ వెర్సా ఎలక్ట్రిక్ బస్సును ప్రదర్శించింది.
అశోల్ లేలాండ్ వెర్సా ఎలక్ట్రిక్ బస్సులో మొత్తం 36 సీట్లు ఉంటాయి. సింగిల్ చార్జ్పై ఈ బస్సు 90 మైళ్ల దూరం ప్రయాణించగలదు. రెగ్యులేషన్స్ని బట్టి, వచ్చే రెండేళ్లలో ఈ వాహనాన్ని ఇండియాలో విడుదల చేయవచ్చని భావిస్తున్నామని అశోక్ లేలాండ్ వైస్ ప్రెసిడెంట్ టి వెంకటరామన్ తెలిపారు.
యూకేకి చెందిన ఆప్టేర్ పిఎల్సి కంపెనీ ద్వారా అశోక్ లేలాండ్ ఈ బస్సులను ఇండియాలో విడుదల చేయనుంది. పూర్తిగా యూకేలో తయారైన బస్సులను (సిబియూ రూట్లో) ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. ఆప్టేర్ కంపెనీలో అశోక్ లేలాండ్కు మెజారీ వాటా ఉంది.
వెర్సా ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనదని, ఎలాంటి వాయు, శబ్ధ కాలుష్యాలను కలిగించదని, ఈ బస్సు ఒక కిలోమీటరు దూరం ప్రయాణించడానికి 1 యూనిట్ విద్యుత్ మాత్రమే వినియోగించుకుంటుందని వెంటకరామన్ వివరించారు.
ఈ ఎలక్ట్రిక్ బస్సు ఖరీదు సుమారు రూ.2-3 కోట్లు ఉండొచ్చని అంచనా. భారత మార్కెట్లో ఆప్టేర్ ఎలక్ట్రిక్ బస్సులను అశోక్ లేలాండ్ బ్యాడ్జ్తోనే విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. ప్రారంభ దశలో భాగంగా ఆప్టేర్ సోలో, వెర్సా మెడళ్లను ఇండియాకు తీసుకురానున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులలో కేవలం మోటార్లు, బ్యాటరీలు మాత్రమే ఉంటాయి.