లీటరుకు రూ.3 లకు పైగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

By Ravi

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, భారత మార్కెట్లో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు లీటరు పెట్రోలుపై రూ.3.18 చొప్పున అలాగే లీటరు డీజిల్‌పై రూ.3.09 చొప్పున ధరలను పెంచాయి.

పెరిగిన ధరలు శనివారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.57.31 నుంచి రూ.60.49కి పెరగగా, లీటరు డీజిల్ ధర రూ.46.62 నుంచి రూ.49.71కి పెరిగింది. ఈ పెంపుకు ముందు ఆగస్ట్ 2014 నుంచి పెట్రోల్ ధరలు వరుసగా పది సార్లు తగ్గగా, డీజిల్ ధరలు వరుసగా ఆరు సార్లు తగ్గాయి.

petrol price hike again in india

ఆగస్ట్ 2014 నుంచి ఇప్పటి వరకూ మొత్తంగా పెట్రోల్ ధర లీటరుకు రూ.17.11 తగ్గగా, డీజిల్ ధర లీటరుకు రూ.12.96 తగ్గింది. కాగా.. ఫిబ్రవరి 2015 నుంచి ఈ ట్రెండ్ రివర్స్ అయ్యింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం మొదలు పెట్టాయి.

Most Read Articles

English summary
Petrol price was on Saturday hiked by Rs 3.18 per litre and diesel by Rs 3.09, the second increase in rates this month on rising international oil rates.
Story first published: Monday, March 2, 2015, 9:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X