ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు

దూర ప్రాంత ప్రయాణాలకు ఉన్న ఏకైక బడ్జెట్ రవాణా సాధనం రైలు, అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన అధునాతన బస్సులు ఈ ధోరణిని మార్చేస్తున్నాయి.

దూర ప్రాంత ప్రయాణాలకు ఉన్న ఏకైక బడ్జెట్ రవాణా సాధనం రైలు, అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన అధునాతన బస్సులు ఈ ధోరణిని మార్చేస్తున్నాయి.

రవాణా రంగంలో దూర ప్రాంత రవాణా సేవలకు రైళ్లకు ప్రత్యామ్నాయంగా వోల్వో బస్సులు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. ప్రభుత్వ మరియు ప్రయివేట్ రంగ రవాణా సంస్థలు దూర ప్రాంతాలకు విరివిగా సేవలందిస్తున్నాయి. ఈ రెండు సంస్థలు వోల్వో బస్సులను విపరీతంగా వినియోగిస్తున్నాయి.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

ఉత్తర భారత దేశాన్ని కలుపుతూ దక్షిత భారతం నుండి ప్రముఖ ప్రభుత్వ రంగ రవాణా సంస్థ కెఎస్‌ఆర్‌టిసి దూర ప్రాంత సర్వీసును నడుపుతోంది. బెంగళూరు నుండి జోధ్‌పూర్ వరకు ఈ సంస్థ బస్సు సర్వీసును ప్రారంభించింది. భారత దేశపు అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు కూడా ఇదే.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

కర్ణాటకలోని బెంగళూరు నుండి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వరకు సుమారుగా 1,950 కిలోమీటర్ల మేర ఇది ప్రయాణిస్తుంది. ఇది బెంగళూరు నుండి అహ్మదాబాద్, ఉదయ్ పూర్ మరియు జైపూర్ మీదుగా జోధ్ పూర్ చేరుకుంటుంది.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థ, ప్రస్తుతం ఉన్న ప్రయివేట్ రవాణా సంస్థలకు పోటీగా వోల్వో సర్వీసులను నడుపుతోంది. అంతే కాకుండా కెఎస్ఆర్‌టిసి చాలా రూట్లలో చాలా వరకు వోల్వో సర్వీసులను నడుపుతోంది.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

ప్రస్తుతం దూర ప్రాంత ప్రయాణాలకు వోల్వో ఇండియన్ మార్కెట్లోకి బి9ఆర్, బి7ఆర్ మరియు మల్టీ ఆక్సిల్ బస్సులను అందుబాటులో ఉంచింది. ప్రపంచ స్థాయి నాణ్యత మరియు సదుపాయాలతో వోల్వో తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది. వోల్వో అందించే సుమారుగా అన్ని బస్సు ఉత్పత్తులను కెఎస్ఆర్‌టిసి కలిగి ఉంది.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

సాధారణ బస్సుల్లో ఆధునిక సాంకేతికత లేమితో ప్రయాణికులు ఎక్కువ సమయం పాటు ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులను ఎందుర్కొంటున్నారు. ఇందుకోసం అధునాతనమైన సీటింగ్ మరియు సౌకర్యాలతో దూర ప్రాంత ప్రయాణాలను ఎంతో సుఖవంతం మరియు సౌకర్యవంతంగా మార్చింది వోల్వో.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

బెంగళూరు నుండి జోధ్ పూర్ వరకు సర్వీసును నడపడానికి కారణం అంటూ ఏమీ లేవు. ఎక్కువ ఈ రూటులో వోల్వో బి9ఆర్ మరియు బి11ఆర్ అదే విధంగా మల్టీ ఆక్సిల్ బస్సులను నడుపుతున్నారు.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

వోల్వో బి11ఆర్ బస్సులో సింగల్ వీల్ ఆక్సిల్ మాత్రమే కలదు. వెనక్కి నడిచేటపుడు ముందు వైపున చక్రాలు వ్యతిరేక దిశలో తిరుగుతాయి. వీటిని ఎక్కువగా సన్నని, ఇరుకైన మరియు అత్యధికంగా రద్దీ ఉండే ప్రదేశాలకు నడుపుతారు.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

వోల్వో బి9ఆర్ మరియు బి11ఆర్ బస్సుల పొడవు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బస్సుల్లో గరిష్టంగా 53 మంది వరకు ప్రయాణించవచ్చు.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

బి11ఆర్ లోని వోల్వో 9400పిఎక్స్ వేరియంట్ బస్సు భారత దేశపు అత్యంత పొడవైన బస్సు. దీని పొడవు గరిష్టంగా 14.5 మీటర్లుగా ఉంది.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

ఈ బస్సును చాలా వరకు ప్రభుత్వ మరియు ప్రయివేట్ రవాణా రంగ సంస్థలు దూర ప్రాంత సర్వీసుల కోసం వినియోగిస్తున్నాయి. ఇందులో షిప్ట్ గేర్‌బాక్స్, స్టీరింగ్ చేసినపుడు వ్యతిరేక దిశలో తిరిగే ఫ్రంట్ వీల్స్, మల్టీ ఆక్సిల్ వంటి ప్రత్యేకతలున్నాయి.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

వోల్వో లోని 9400పిఎక్స్ మోడల్ బస్సు యొక్క టర్నింగ్ రేడియస్ 180 డిగ్రీలుగా ఉంది.

  • మారుతి నుండి వస్తోన్న బడ్జెట్ ఫ్రెండ్లీ సోలియో 7-సీటర్
  • తప్పుడు మైలేజ్ ప్రకటనలు ఇచ్చినందుకు హీరోకు తగిన శాస్తే జరిగింది
  • ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

    వోల్వో లోని బి9ఆర్ బస్సుల నిర్వహణ వ్యయం చాలా తక్కువ అందుకోసం ఈ బస్సులను అధికంగా దూర ప్రాంత ప్రయాణాల కోసం వినియోగిస్తారు.

    ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

    వోల్వో బి9ఆర్ బస్సులో 340హార్స్‌పవర్ ఉత్పత్తి చేయగల 9.4-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు. ఇదు యూరో-3 ఉద్గార నియమాలను పాటిస్తుంది. ఇందులోని ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఐ షిఫ్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఆప్షనల్‌గా అందించారు.

    ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

    ఐ-షిప్ట్ గేర్ బాక్స్ వలన ఎక్కువ మైలేజ్, తక్కువ కుదుపులు మరియు ఇంజన్ యొక్క పనితీరు ఉత్తమంగా ఉంచటుంది. ఈ ఐ-షిఫ్ట్ గేర్‌బాక్స్‌ని వినియోగించడం వలన సాంకేతికంగా ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి.

    ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

    వోల్వో లోని సుమారుగా అన్ని ఇంజన్‌లు కూడా త్వరితగతిన అత్యంధిక పవర్‌ను విడుదల చేస్తాయి, అద్భుతమైన పర్ఫామెన్స్‌ వలన అతి తక్కువ కాల వ్యవధిలోనే గరిష్ట వేగాన్ని అందుకుంటాయి. ఈ బస్సుల్లో సుమారుగా 300 నుండి 400 లీటర్ల వరకు ఇంధన సామర్థ్యం గల ట్యాంకులు కలవు.

    ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

    సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఇందులో అధునాతనమైన సస్పెన్షన్ సిస్టమ్ అందించారు. ఎలాంటి వేగం వద్ద అయినా ధృడంగా మరియు స్థిరంగా ఉంటుంది. ఇందులో చాలా వరకు ఎంత పెద్ద కుదుపులైనా ప్రయాణికుల వరకు రావు.

    ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

    వోల్వో సంస్థ తమ బస్సుల్లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ గల బ్రేకింగ్ సిస్టమ్ అందించింది. మృదువైన జారుడు రోడ్లు మరియు వాలు తలం మీద పటిష్టాన్ని కలిగి ఉండేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. అత్యవసర సందర్భాల్లో వెంటనే బ్రేక్స్ ఉపయోగించడం వలన టైర్లు డ్యామేజ్ అవకుండా ట్యూబ్ లెస్ టైర్లను అందించారు.

    • టాటా నెక్సాన్ కస్టమర్లకు కుచ్చుటోపీ
    • కొత్త స్విఫ్ట్ మరియు పాత స్విఫ్ట్ మధ్య తేడా ఏమిటి?
    • ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

      చాలా మంది బస్సు ప్రయాణాల్లో పొద్దుపోలేదని అసహనం వ్యక్తం చేస్తారు. అయితే వోల్వో వారి లగ్జరీ బస్సుల్లో ఉన్నసదుపాయాలతో ప్రయాణం ఎంతో సుఖమయంగా ఉంటుది. అత్యంత దూరం ప్రయాణించే బస్సు సుమారుగా తన 36 గంటల ప్రయాణాన్ని ఏ ఇబ్బంది లేకుండా ఎంతో సౌకర్యవంతంగా పూర్తి చేస్తుంది.

      ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

      ఈ రూట్‌లో సుమారుగా 1,500 నుండి 2,200 వరకు ప్రయాణ ధర ఉంటుంది. ఇంకా విచిత్రం ఏమిటంటే ఒక్కో సారి విమాన ఛార్జీలకు సమాన ధరను చెల్లించి మరి ప్రయాణిస్తుంటారు.

      ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

      దూర ప్రాంత ప్రయాణాల సర్వీసులను నడపడానికి ప్రభుత్వ మరియు ప్రయివేట్ రంగ రవాణా సంస్థలు వోల్వోతో పాటు మెర్సిడెస్ బెంజ్, స్కానియా మల్టీ ఆక్సిల్ వంటి బస్సులను కూడా వినియోగిస్తున్నాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Interesting Details About India's Longest Bus Route
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X