Just In
- 7 min ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 3 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 5 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 9 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
భారీగా పెరగనున్న కార్ల ధరలు: 2018లో కొనడానికి ప్లాన్ చేస్తే నష్టపోయినట్లే
ఇసుజు మోటార్స్ ఇండియా దేశీయంగా అందుబాటులో ఉంచిన పికప్ ట్రక్కులు మరియు ఎస్యూవీల మీద జనవరి 1, 2018 నుండి ధరల పెంచడానికి సిద్దమైంది. తమ ఉత్పత్తుల మీద 3 నుండి 4 శాతం మేరకు ధరలు పెంచాలని భావించింది.
ఇండియన్ మార్కెట్లో దేశీయ ప్యాసింజర్ కార్లు, ప్యాసింజర్ వాహనాలు మరియు వాణిజ్య వాహన తయారీ సంస్ఖలు తమ ఉత్పత్తుల మీద 2018 జనవరి నుండి ధరలు పెంచడానికి సిద్దమయ్యాయి. అందులో ఒకటి జపాన్ దిగ్గజం ఇసుజు మోటార్స్.
ఇసుజు మోటార్స్ ఇండియా దేశీయంగా అందుబాటులో ఉంచిన పికప్ ట్రక్కులు మరియు ఎస్యూవీల మీద జనవరి 1, 2018 నుండి ధరల పెంచడానికి సిద్దమైంది. తమ ఉత్పత్తుల మీద 3 నుండి 4 శాతం మేరకు ధరలు పెంచాలని భావిస్తున్నట్లు తెలిసింది.
ఇసుజు మోటార్స్ ప్రస్తుతం డి-మ్యాక్స్ , డి-మ్యాక్స్ ఎస్-క్యాబ్, డి-మ్యాక్స్ వి-క్రాస్ మరియు ఎమ్యు-ఎక్స్ వాహనాలను విక్రయిస్తోంది.
- డి-మ్యాక్స్ వి-క్రాస్ ధర రూ. 13.31 లక్షలు
- ఎమ్యు-ఎక్స్ ధరల శ్రేణి రూ. 23.83 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు ఉంది.
ఇసుజుకి భావించిన మేరకు తమ నాలుగు ఉత్పత్తుల ధరల్లో 3 నుండి 4 శాతం పెంపు ఖాయం అని తెలుస్తోంది. ఈ ధరల పెంపు తప్పనిసరైతే ఇసుజు రెగ్యులర్ క్యాబ్ వాణిజ్య వాహనం డి-మ్యాక్స్ మరియు డి-మ్యాక్స్ ఎస్-క్యాబ్ ధర సుమారుగా రూ. 15,000 ల వరకు పెరిగే అవకాశం ఉంది.
ఇసుజు లైనప్లోని ఖరీదైన ప్రీమియమ్ ఎస్యూవీ ఎమ్యు-ఎక్స్ ధర రూ. 1 లక్ష వరకు పెరగనుంది. గతంలో వస్తు మరియు సేవల పన్ను అమల్లోకి రావడంతో వి-క్రాస్ మరియు ఎమ్యు-ఎక్స్ వాహనాల ధరలు తగ్గాయి.
2018 నుండి ధరల పెంపు బాటలో ఇసుజు మోటార్స్ మాత్రమే కాదు, స్కోడా కూడా వచ్చే 2018 నుండి తమ వాహనాల మీద ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. వీటితో మరిన్ని ప్యాసింజర్ కార్లు మరియు వాణిజ్య వాహన తయారీ సంస్థల కూడా 2018 జనవరిలో ధరలు పెంచనున్నాయి.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో చాలా వరకు వాహన తయారీ సంస్థలు ధరల పెంపుకు సిద్దమవుతున్నాయి. ఇసుజుతో దాదాపు అన్ని కంపెనీల కార్ల ధరలకు రెక్కలు రానున్నాయి. మరికొన్ని వారాల్లో ఒక్కొక్కటిగా తమ వాహనాల మీద ధరల పెంపును అధికారికంగా ప్రకటించనున్నాయి.