Just In
- 1 hr ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 2 hrs ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 4 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 5 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
Don't Miss
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Movies Yuva Movie Collections పునీత్ రాజ్కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
డిసెంబర్ 31 తరువాత అన్ని లారీలు, ట్రక్కులలో ఏ/సి క్యాబిన్ తప్పనిసరి చేసి కేంద్రం
డిసెంబర్ 31, 2017 నాటికి వాణిజ్యపరమైన అన్ని వాహనాలలో ఏ/సి క్యాబిన్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం ప్రకటించింది.
దేశవ్యాప్తంగా అన్ని ట్రక్కులు మరియు లారీలలో ఏప్రిల్ 1, 2017 నాటికి ఏ/సి క్యాబిన్ తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. అయితే ఈ గడువును డిసెంబర్ 31, 2017 నాటికి వాణిజ్యపరమైన అన్ని వాహనాలలో ఏ/సి క్యాబిన్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం ప్రకటించింది.
అన్ని ఎన్2(3.5 నుండి 12 టన్నులు) మరియు ఎన్3(12 టన్నులకు పైబడిన) కెటగిరీ ట్రక్కుల్లోని క్యాబిన్లో ఏ/సిని తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారులు మరియు షిప్పింగ్ శాఖ మంత్రి పేర్కొన్నారు.
Recommended Video
దేశం మొత్తం మీద జరుగుతున్న ప్రమాదాలలో ఇలాంటి భారీ ట్రక్కుల ప్రమేయం అధికంగా ఉన్నట్లు సర్వేలలో వెల్లడైంది. లారీ మరియు ట్రక్కుల డ్రైవర్లు అధిక దూరం పాటు వాహనాన్ని నడపడం, మరియు క్యాబిన్లో సమతుల ఉష్ణోగ్రత లేకపోవడంతో ఒత్తిడికి గురయ్యి ప్రమాదాలు చేస్తున్నారు, దీనిని నివారించడానికి ఎన్2 మరియు ఎన్3 కెటగిరీ ట్రక్కుల్లో ఏ/సి తప్పనిసరి అనే నియమాన్ని అమల్లోకి తెచ్చారు.
ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాలలో 1.5 లక్షల మంది మరణిస్తుండగా, సుమారుగా మూడు లక్షల మంది గాయాలపాలవుతున్నారు. లారీలలో ఏ/సి లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, ప్రమాదాలు గణనీయంగా తగ్గుముఖం పట్టనున్నాయి.
2015 గణాంకాల ప్రకారం, ఒక్క 2015 లో 1,46,133 మంది రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు. రోడ్డు ప్రమాదాలకు 11.4 శాతం వరకు లారీలు కారణం కాగా, 7.4 శాతం వరకు బస్సులు కారణమవుతున్నాయి.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి లారీలు మరియు ట్రక్కులలో ఏ/సి క్యాబిన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పదని చెప్పవచ్చు. లారీలలో ఏ/సి ఉండటం ద్వారా డ్రైవర్లు అలసట మరియు ఒత్తిడికి దూరమవుతారు, కాబట్టి లారీ యజమానులంతా దీనికి సహకరించి, ఈ నియమాన్ని అనుసరించడం ఎంతైనా ఉత్తమం.