Just In
- 4 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 6 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 8 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 11 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హైవేల కోసం భారత్ మాలా ప్రాజెక్ట్: 7 లక్షల కోట్ల బృహత్తర ప్రణాళికకు కేబినేట్ ఆమోదం
దేశవ్యాప్తంగా హైవేల నిర్మాణం మరియు అభివృద్ది కోసం నరేంద్ర మోదీ సర్కారు 7 లక్షల కోట్ల రుపాయల బడ్జెట్తో భారత్ మాలా అనే ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టుంది.
దేశవ్యాప్తంగా హైవేల నిర్మాణం మరియు అభివృద్ది కోసం నరేంద్ర మోదీ సర్కారు 7 లక్షల కోట్ల రుపాయల బడ్జెట్తో భారత్ మాలా అనే ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టుంది. ఐదేళ్ల కాలంలో సుమారుగా 83,677 కిలోమీటర్ల హైవేలను అభివృద్ది చేయనున్నారు.
రూ. 5.35 లక్షల కోట్లతో తొలిదశలో 2022 లోపు దేశవ్యాప్తంగా 34,800 కిలోమీటర్ల కొత్త హైవేలను నిర్మించనున్నారు. వచ్చే ఐదేళ్లలోపు దేశవ్యాప్తంగా మొత్తం 83,000 కిలోమీటర్ల రహదారుల మరమత్తు మరియు అభివృద్దికి 7 లక్షల కోట్ల రుపాయలతో కేంద్రం రూపొందించిన బృహత్తర ప్రణాళికకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Recommended Video
మంగళవారం(24 అక్టోబర్, 2017) నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఆర్థిక సలహాదారుడు అశోక్ లవాసా మాట్లాడుతూ, మెరుగైన మౌళిక వనరుల సదుపాయ కల్పనకు దేశవ్యాప్కంగా 9,000 కిలోమీటర్ల ఎకనామిక్ కారిడార్లను నిర్మించనున్నట్లు తెలిపాడు.
గతంలో ఎన్హెచ్డీపీ ప్రాజెక్ట్ క్రింద కేంద్రం 50,000 కిలోమీటర్ల రహదారులను నిర్మించింది. ఇప్పుడు 80,000 కిలోమీటర్ల నిర్మాణానికి భారీ నిధులతో భారత్మాల ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టిందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. భారత్మాల భారతదేశపు రెండవ అతి పెద్ద హైవే నిర్మాణ ప్రాజెక్ట్.
ఈ ప్రాజెక్టులో భాగంగా దేశం మొత్తం 44 ఎకనామిక్ కారిడర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. వీటిలో ప్రధానంగా ముంబాయ్-కొచ్చి-కన్యాకుమారి, బెంగళూరు-మంగళూరు, హైదరాబాద్-పనాజీ, సబల్పూర్-రాంచీ కారిడార్లను నిర్మించనున్నారు.
భారత్మాల ప్రాజెక్టులో భాగంగా 2022 నాటికి హైవేల నిర్మాణం మరియు అభివృద్దితో పాటు వివిధ దశల వారీగా దేశ ఆర్థిక మరియు వాణిజ్య ప్రాంతాలను దేశసరిహద్దులు, అంతర్జాతీయ పోర్టులు, తీర ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ హైవే కారిడార్ల నిర్మాణం మరియు అభివృద్దిని లక్ష్యంగా చేసుకుంది.
ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తూనే, ఈ ప్రాజెక్ట్ ద్వారా 2022 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న శ్రామికులకు 32 కోట్ల పనిదినాలు కల్పన జరగనుంది. ప్రధాన రహదారుల్లో రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక మౌళిక సదుపాయ కల్పనకు కూడా ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది.
Trending On DriveSpark Telugu:
కొత్త కార్ల రిజిస్ట్రేషన్ నిలిపేసిన సింగపూర్