Just In
- 3 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 4 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 6 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 9 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఫలించిన ఎనిమేదళ్ల నిరీక్షణ: చేసిన తప్పుకు కస్టమర్కు పరిహారం చెల్లించిన మారుతి
మారుతి షోరూమ్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కారులోని సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వినియోగదారుల కోర్టుకు మారుతి మీద ఫిర్యాదు చేశాడు. సుమారుగా 8 సంవత్సరాలు పాటు సాగిన కేసు ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి.
మారుతి సుజుకి అంటే నాణ్యమైన కార్లు, అత్యుత్తమ సర్వీసింగ్, అద్భుతమైన డీలర్ నెట్వర్క్ కలిగిన కార్ల కంపెనీగా ఇండియన్ కస్టమర్లలో ఓ చెరగని ముద్ర వేసుకుంది. కేవలం ఈ మూడు లక్షణాల కారణంగా చాలా మంది మారుతి సుజుకి కార్లను ఎంచుకుంటారు.
అలాంటి వారిలో ఒకరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎమ్ విజేత్. మారుతి సుజుకి సంస్థను అపారంగా నమ్మిన విజేత్ మారుతి నుండి ఆల్టో లోని ఎల్ఎక్స్ఐ వేరియంట్ కారును కొనుగోలు చేశాడు. కారు డెలివరీ తీసుకున్న మొదటి రోజు నుండే టార్చర్ ఏంటో తెలుసొచ్చింది.
Recommended Video
మారుతి షోరూమ్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కారులోని సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వినియోగదారుల కోర్టుకు మారుతి మీద ఫిర్యాదు చేశాడు. సుమారుగా 8 సంవత్సరాలు పాటు సాగిన కేసు ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఈ కేసులో కస్టమర్కు అనుకూలంగా తీర్పు వచ్చింది.
అసలు ఏం జరిగిందో చూద్దాం రండి....
కర్ణాటకలోని మండోవి మోటార్స్ వద్ద ఆగష్టు 22, 2009లో సరికొత్త మారుతి ఆల్టో ఎల్ఎక్స్ కారును కొనుగోలు చేశాడు. తన తండ్రి పేరు మీద తీసుకున్న ఈ కారును విజేత్ డ్రైవ్ చేసింది చాలా తక్కువే అయినప్పటికీ, ప్రతి రోజు కారులో ఉన్న సాంకేతిక లోపాలను గుర్తిస్తూ, షోరూమ్ చుట్టూ తిరిగిన సందర్భాలే ఎక్కువ.
అనేక సమస్యలు, తీవ్ర సాంకేతిక లోపాలున్న కారుతో విజేత్ మారుతి సర్వీసింగ్ సెంటర్ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయాడు. ఎన్నిసార్లు మారుతి సర్వీసింగ్ సెంటర్ను సంప్రదించినా ఏదో ఒక లోపం బయటపడేది. ఆయన తన సొంత అవసరాలకు వాడుకున్న దానికంటే, సర్వీసింగ్ సెంటర్ కోసం తిరిగిందే ఎక్కువ.
మారుతి సుజుకి డీలర్తో విసిగిపోయిన కస్టమర్ విజేత్ జిల్లా వినియోగదారుల కోర్టులో మారుతి మీద ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 30, 2010లో ఈ కేసు తీర్పుకు వచ్చింది. కారులో సాంకేతిక లోపాలు మరియు సమస్యలు ఉండటంతో కారు మొత్తం ధర రూ. 2.95 లక్షలు మరియు వ్యాజ్యానికి ఖర్చయిన రూ. 10,000 లను అదనంగా చెల్లించాలని మారుతి మరియు డీలర్కు కోర్టు సూచించింది.
Trending On DriveSpark Telugu:
కార్ వాష్ చేసి, సర్వీస్ మొత్తం చేసినట్లు మోసగించిన మారుతి డీలర్
కనీవిని ఎరుగుని సేల్స్: మారుతికి ముచ్చెమటలు పట్టిస్తున్న డిజైర్
మహీంద్రా & టాటా లకు మారుతి సుజుకి దిమ్మతిరిగే షాక్
దిగువ కోర్టు తీర్పుతో అంగీకరించని మారుతి సుజుకి మరియు డీలర్ రాష్ట్ర వినియోగదారుల కోర్టులో తీర్పుకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. అయితే, నవంబర్ 2, 2011 వ తేదీన రాష్ట్ర వినియోగదారుల కోర్టు కేసును కొట్టివేసి, జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
జిల్లా మరియు రాష్ట వినియోగదారుల కోర్టులు ఇచ్చిన తీర్పుతో అసంతృప్తి చెందిన మారుతి సుజుకి మరియు మారుతి డీలర్ ఇదే విశయమై జాతీయ కోర్టును ఆశ్రయించారు. కారును కొనుగోలు చేసిన సుమారుగా 8 సంవత్సరాల అనంతరం ఆ కేసుకు సంభందించిన తీర్పు వచ్చింది
సాంకేతిక లోపం ఉన్న కారును రాంజేంద్ర అనే వ్యక్తికి విక్రయించినందుకు గాను, నష్టపరిహారం క్రింద రూ. 1.5 లక్షలు చెల్లించాలని మారుతి సుజుకి మరియు డీలర్కు సూచించింది. వ్యాజ్యపు ఖర్చుల పరిహారం క్రింద మరో రూ. 11,000 లను రాజేంద్రకు అందించాలని కోర్టు తీర్పునిచ్చింది.
లోపాలున్న మారుతి ఆల్టో ఎల్ఎక్స్ కారును సుమారుగా 50,000 కిలోమీటర్ల నడిపాడు. 8 సంవత్సరాలుగా వినియోగిస్తూ వచ్చాడు. అయితే, నిరీక్షణకు ఫలితం దక్కింది. మారుతి డీలర్ నుండి నష్టపరిహారంగా కోర్టు తెలిపిన మొత్తాన్ని అందుకుని దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మీద నెగ్గాడు.