Just In
- 10 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 12 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 14 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 17 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మూడేళ్ల గరిష్టానికి పెట్రోల్ మరియు డీజల్ ధరలు
పెట్రోల్, డీజల్ రోజువారీ ధరల సమీక్ష విధానం ప్రస్తుత మార్కెట్ పరిస్థితులపై చాలా ప్రభావం చూపుతోంది. ఈ విధానంతో ఇంధన ధరలు రోజు రోజుకీ పెరగడం తప్పితే, తగ్గిన సంధర్భాలు చాలా తక్కువ.
పెట్రోల్, డీజల్ రోజువారీ ధరల సమీక్ష విధానం ప్రస్తుత మార్కెట్ పరిస్థితులపై చాలా ప్రభావం చూపుతోంది. ఈ విధానంతో ఇంధన ధరలు రోజు రోజుకీ పెరగడం తప్పితే, తగ్గిన సంధర్భాలు చాలా తక్కువ.
రోజుకిన్ని పైసలు చొప్పున పెరుగుతూ వచ్చిన పెట్రోల్ మరియు డీజల్ ధరలు మూడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. దీంతో ఇంధన ధరలు చుక్కలనుంటుతున్నాయి.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి....
పెట్రోల్:
- ముంబాయ్ రూ. 79.54 లు
- ఢిల్లీ రూ. 70.43 లు
- కలకత్తా రూ. 73.17 లు
- హైదరాబాద్ రూ. 74.58 లు
- హైదరాబాద్ రూ. 63.89 లు
- ఢిల్లీ రూ. 58.80 లు
- కలకత్తా రూ. 61.46 లు
- ముంబాయ్ రూ. 62.46 లు
గత మూడేళ్ల కాలంలో పెట్రోల్ మరియు డీజల్ ధరలు ఎన్నడూ ఈ స్థాయికి చేరుకోలేదు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేసిన రోజువారీ ఇంధన ధరల సమీక్ష విధానంతో ఇంధన ధరలు మూడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి.
Recommended Video
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గడిచిన మూడు సంవత్సరాలలో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయంగా ఉన్న క్రూడ్ ఆయిల్ ధరల పతనంతో ఇండియాలో పెట్రోల్ మరియు డీజల్ ధరలు గణనీయంగా తగ్గాల్సి ఉంది.
2013-14 లో క్రూడ్ ఆయిల్ సగటు ధర 105.52 డాలర్లుగా ఉండేది, అదే కాలంలో ఢిల్లీ పెట్రోల్ ధర రూ. 69.75 లుగా ఉండేది. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. దీంతో 2014-15లో క్రూడ్ ఆయిల్ ధర 84.16 డాలర్లకు పడిపోయింది. ఇప్పుడు ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 66.37 లకు చేరుకుంది.
ఆ తర్వాత ఏడాది 2015-16లో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 46.17 డాలర్లకు పడిపోయింది. అయినప్పటికీ ఇండియాలో పెట్రోల్ ధరలో పెద్ద మార్పులేవీ జరగలేదు. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 61.72 లుగా ఉండేది.
2016-17 ఏడాదిలో ముడి చమురు ధరలు 47.56 డాలర్లుగా ఉంటే, ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 64.84 లుగా ఉంది. గడిచిన మూడేళ్ల కాలంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు విపరీతంగా తగ్గుతూ వచ్చాయి, వాటిని అనుసరిస్తే ఇండియాలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ 32 రుపాయల ధరతో లభించాల్సి ఉంది.
అడ్డూ అదుపు లేకుండా పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు, జూన్ 16 నుండి రోజూ వారీ ఇంధన ధరలను సమీక్షించే విధానాన్ని అమలు చేయడంతో ప్రతి రోజూ కొన్ని పైసలు చొప్పున పెరిగిన ధరలు ఇప్పుడు మూడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి.