Just In
- 4 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 6 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 9 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 10 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మోటార్ వెహికల్ చట్టంలోని మార్పులను క్యాబినెట్ ఆమోదించింది
లైసెన్స్ జారీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిచేస్తూ అదే విధంగా డ్రైవర్ ప్రమాదంలో ప్రాణాలు తీసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర మోటార్ వెహికల్ చట్టంలో అనేక మార్పులు చేసింది.
వెహికల్
డ్రైవింగ్
లైసెన్స్
మరియు
రిజిస్ట్రేషన్కు
ఆధార్
అనుసంధానం
తప్పనిసరి
చేస్తూ
మరియు
ట్రాఫిక్
ఉల్లంఘనలకు
పాల్పడే
వారిపై
కఠిన
చర్యలు
విధించేందుకు
మోటార్
వాహనాల
చట్టంలోని
2016
సవరణ
బిల్లును
క్యాబినెట్
ఆమోదించింది.
మద్యం సేవించి వాహనాలను నడిపే వారిపై చర్యలను మరింత కఠినం చేసారు. ప్రస్తుతం ఉన్న జరిమానాను ఐదు రెట్లు పెంచుతూ రూ. 10,000 లుగా డ్రంక్ అండ్ డ్రైవ్కు ఫైన్ ఖరారు చేశారు. మద్యం మత్తులో ఎవరినైనా ఢీ కొంటె బెయిల్ రహిత పదేళ్ల జైలు శిక్షను తీసుకొచ్చారు. నూతన చట్టంలో ఉన్న మరిన్ని నేరాలకు సంభందించిన ఫైన్ల వివరాలు
1. యజమానులు యువతకు కార్లు ఇచ్చినట్లయితే వాటి రిజిస్ట్రేషన్ రద్దు చేయడం, ఇదే సందర్భంలో వారు ప్రమాదం చేస్తే ఆ కుటుంబం సుమారుగా రూ. 25,000 ల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మరియు మూడేళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం కూడా ఉంది.
2. నాణ్యత ప్రమాణాలను పాటించే హెల్మెట్ మాత్రమే వినియోగించాలనే అంశాలను సవరణ బిల్లులో పొందుపరిచారు.
3. శిరస్త్రాణం లేకుండా నడిపే వారికి సుమారుగా రూ. 1,000 ల వరకు జరిమానా విధిస్తూ, డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలల పాటు రద్దు చేయనున్నారు. సిగ్నల్ జంప్ అవ్వడం మరియు సీట్ బెల్ట్ లేకుండా డ్రైవ్ చేసినా కూడా ఈ చర్యలు తప్పవు.
4. ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసేటపుడు పోలీసులకు పట్టుబడితే విధించే జరిమానాను రూ. 1,000 లు నుండి రూ. 5,000 లకు పెంచారు.
5. తప్పులేకుండా రహదారి ప్రమాదానికి గురైనపుడు మరణించే బాధితులకు రూ. 10 లక్షల వరకు మరియు తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షల వరకు పరహారం అందజేయనున్నారు. గతంలో ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 25,000 లు మరియు మరిణించిన వారి తరపున రూ. 50,000 లు మాత్రమే పరిహారంగా చెల్లించేవారు.
6. హిట్ అండ్ రన్ (ఢీ కొట్టి పారిపోతే) ఎవరైనా ప్రమాదం చేసి పారిపోతే హిట్ అండ్ రన్ ప్రమాదం క్రింద మరణించిన వారికి రూ. 2 లక్షలు మరియు తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 50,000 ల వరకు ప్రభుత్వం పరిహారం అందివ్వనుంది.
7. భీమాదారులు మరణిస్తే గరిష్ట పరిహారం రూ. 10 లక్షలు మరియు తీవ్రంగా గాయపడితే రూ. 5 లక్షలు పరిహారం చెల్లించాలనే మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది.
అంతే కాకుండా వాహన రిజిస్ట్రేషన్ పనులను సంభందిత డీలర్కు అప్పగించాలని మరియు రిజిస్ట్రేషన్ ప్రదేశం ఆర్టిఓ కార్యాలయంలోనా ? లేదా విక్రయ దారుని వద్దే ఉండాలా ? అనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకునేట్లు చట్టం తీసుకొచ్చారు.
నకిలీ రిజిస్ట్రేషన్ మరియు నకిలీ లైసెన్స్ సమస్యను రూపుమాపేందుకు జాతీయ రిజిస్ట్రేషషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ఏకైక నమోదు సంఖ్యను జారీ చేయడానికి ఆస్కారం ఉంది.
వాహన తయారీదారులు ఉత్పత్తి చేసే వాహనాలలోని విడి భాగాలు మరియు ఇంజన్లు ప్రమాణాలకు తగ్గట్లుగా లేకపోతే కేంద్రం రీకాల్ చేయనుంది. ఇందుకు వాహన తయారీ సంస్థలు రూ. 500 కోట్ల వరకు ప్రభుత్వానికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.