Just In
- 31 min ago త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- 3 hrs ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 4 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 4 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
Don't Miss
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Movies నాగార్జున ఇంటికి కోడలుగా రాబోతున్న మరో హీరోయిన్
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మోటార్ వెహికల్ చట్టంలోని మార్పులను క్యాబినెట్ ఆమోదించింది
లైసెన్స్ జారీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిచేస్తూ అదే విధంగా డ్రైవర్ ప్రమాదంలో ప్రాణాలు తీసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర మోటార్ వెహికల్ చట్టంలో అనేక మార్పులు చేసింది.
వెహికల్
డ్రైవింగ్
లైసెన్స్
మరియు
రిజిస్ట్రేషన్కు
ఆధార్
అనుసంధానం
తప్పనిసరి
చేస్తూ
మరియు
ట్రాఫిక్
ఉల్లంఘనలకు
పాల్పడే
వారిపై
కఠిన
చర్యలు
విధించేందుకు
మోటార్
వాహనాల
చట్టంలోని
2016
సవరణ
బిల్లును
క్యాబినెట్
ఆమోదించింది.
మద్యం సేవించి వాహనాలను నడిపే వారిపై చర్యలను మరింత కఠినం చేసారు. ప్రస్తుతం ఉన్న జరిమానాను ఐదు రెట్లు పెంచుతూ రూ. 10,000 లుగా డ్రంక్ అండ్ డ్రైవ్కు ఫైన్ ఖరారు చేశారు. మద్యం మత్తులో ఎవరినైనా ఢీ కొంటె బెయిల్ రహిత పదేళ్ల జైలు శిక్షను తీసుకొచ్చారు. నూతన చట్టంలో ఉన్న మరిన్ని నేరాలకు సంభందించిన ఫైన్ల వివరాలు
1. యజమానులు యువతకు కార్లు ఇచ్చినట్లయితే వాటి రిజిస్ట్రేషన్ రద్దు చేయడం, ఇదే సందర్భంలో వారు ప్రమాదం చేస్తే ఆ కుటుంబం సుమారుగా రూ. 25,000 ల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మరియు మూడేళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం కూడా ఉంది.
2. నాణ్యత ప్రమాణాలను పాటించే హెల్మెట్ మాత్రమే వినియోగించాలనే అంశాలను సవరణ బిల్లులో పొందుపరిచారు.
3. శిరస్త్రాణం లేకుండా నడిపే వారికి సుమారుగా రూ. 1,000 ల వరకు జరిమానా విధిస్తూ, డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలల పాటు రద్దు చేయనున్నారు. సిగ్నల్ జంప్ అవ్వడం మరియు సీట్ బెల్ట్ లేకుండా డ్రైవ్ చేసినా కూడా ఈ చర్యలు తప్పవు.
4. ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసేటపుడు పోలీసులకు పట్టుబడితే విధించే జరిమానాను రూ. 1,000 లు నుండి రూ. 5,000 లకు పెంచారు.
5. తప్పులేకుండా రహదారి ప్రమాదానికి గురైనపుడు మరణించే బాధితులకు రూ. 10 లక్షల వరకు మరియు తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షల వరకు పరహారం అందజేయనున్నారు. గతంలో ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 25,000 లు మరియు మరిణించిన వారి తరపున రూ. 50,000 లు మాత్రమే పరిహారంగా చెల్లించేవారు.
6. హిట్ అండ్ రన్ (ఢీ కొట్టి పారిపోతే) ఎవరైనా ప్రమాదం చేసి పారిపోతే హిట్ అండ్ రన్ ప్రమాదం క్రింద మరణించిన వారికి రూ. 2 లక్షలు మరియు తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 50,000 ల వరకు ప్రభుత్వం పరిహారం అందివ్వనుంది.
7. భీమాదారులు మరణిస్తే గరిష్ట పరిహారం రూ. 10 లక్షలు మరియు తీవ్రంగా గాయపడితే రూ. 5 లక్షలు పరిహారం చెల్లించాలనే మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది.
అంతే కాకుండా వాహన రిజిస్ట్రేషన్ పనులను సంభందిత డీలర్కు అప్పగించాలని మరియు రిజిస్ట్రేషన్ ప్రదేశం ఆర్టిఓ కార్యాలయంలోనా ? లేదా విక్రయ దారుని వద్దే ఉండాలా ? అనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకునేట్లు చట్టం తీసుకొచ్చారు.
నకిలీ రిజిస్ట్రేషన్ మరియు నకిలీ లైసెన్స్ సమస్యను రూపుమాపేందుకు జాతీయ రిజిస్ట్రేషషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ఏకైక నమోదు సంఖ్యను జారీ చేయడానికి ఆస్కారం ఉంది.
వాహన తయారీదారులు ఉత్పత్తి చేసే వాహనాలలోని విడి భాగాలు మరియు ఇంజన్లు ప్రమాణాలకు తగ్గట్లుగా లేకపోతే కేంద్రం రీకాల్ చేయనుంది. ఇందుకు వాహన తయారీ సంస్థలు రూ. 500 కోట్ల వరకు ప్రభుత్వానికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.