Just In
- 24 min ago త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- 3 hrs ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 4 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 4 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
Don't Miss
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Movies నాగార్జున ఇంటికి కోడలుగా రాబోతున్న మరో హీరోయిన్
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
వాహనం కొనుగోలు చేసే ముందు సుప్రీం కోర్టు యొక్క ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి..!!
దేశీయ వాహన రంగంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయాలు... గడువులోపు వివరణ ఇవ్వండంటూ వాహన తయారీ సంస్థలను ఆదేశించిన సుప్రీం కోర్టు....
ప్రతి
ఏడాది
భారత
వాహన
పరిశ్రమలో
కొత్త
నియమాలు,
కొత్త
నిభందనలు
అమల్లోకి
వస్తుంటాయి.
ఎప్పటిలాగే
సుప్రీం
కోర్టు
కొన్ని
కొత్త
రూల్స్ను
ప్రకటించింది.
ఆ
రూల్స్
ఏంటి,
వాటి
వలన
ఎవరికి
లాభం
గురించి
మరిన్ని
వివరాలు...
వచ్చే ఏప్రిల్ 1, 2017 నుండి దేశీయంగా అమ్ముడుపోయే ప్రతి వాహనంలో కూడా బిఎస్-4 ఇంజన్ తప్పనిసరిగా ఉండాలి. అయితే ఇప్పుడు యథావిధిగా బిఎస్-3 ఇంజన్లు గల వాహనాలను విక్రయించుకోవచ్చు. అయితే వాహన తయారీ సంస్థలకు తలపోటు తెప్పించే ఆదేశాన్ని సుప్రీం కోర్టు జారీ చేసింది.
బిఎస్-4 వాహనాలు పరిచయం చేసిన తరువాత, అమ్ముడుపోకుండా నిలిచిపోయిన బిఎస్-3 వెహికల్స్ ఏ మేరకు ఉన్నాయో అనే వివరణ ఇవ్వాలని పేర్కొంది.
ఇటి ఆటో ప్రకారం, వాహన తయారీ సంస్థలు ఇచ్చే గణాంకాలను బట్టి, బిఎస్-3 నియమాలను పాటించే వాహనాలు గడువులోపు ఎక్కువ సంఖ్యలో తయారీదారుల వద్ద ఉంటే, వాటిని తిరిగి అమ్ముకునే విశయంపై పునరాలోచన చేయనున్నట్లు తెలిసింది.
అంతే కాకుండా డిసెంబర్ 31, 2015 నుండి ఇప్పటి వరకు ఉత్పత్తి అయిన బిఎస్-3 వాహనాలు వివరాలను వెల్లడించాలని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫ్యాక్చరర్స్(SIAM) ను సుప్రీ కోర్టు కోరింది.
ఇప్పటి వరకు అమ్ముడుపోకుండా నిలిచిపోయిన బిఎస్-3 ఉద్గార నియమాలను పాటించే వాహనాల వివరాలను సియామ్ కాలుష్య నియంత్రణ మండలికి ఓ నివేదికను సమర్పించింది.
సియామ్ వెల్లడించిన వివరాలు మేరకు, 20,000 కార్లు మరియు ఎస్యూవీలు, 7,50,000 ద్విచక్ర వాహనాలు, 47,000 మూడు చక్రాల వాహనాలు అదే విధంగా 75,000 కమర్షియల్ వాహనాలు ఉన్నట్లు వివరించింది.
కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏప్రిల్ 1 , 2017 నుండి అన్ని వాహనాలను కూడా బిఎస్- IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్లతో మాత్రమే విక్రయించాలిని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
అయితే గడువులోపు బిఎస్-III ఉద్గార నియమాలను పాటించే ఇంజన్లు ఉన్న వాహనాల స్టాక్ పూర్తి చేసేందుకు వాహన తయారీ సంస్థలు అనేక డిస్కౌంట్లు మరియు భారీ ఆఫర్లతో కస్టమర్లకు ఎర వేస్తున్నాయి.
బిఎస్-III ప్రమాణాలను పాటించే ఇంజన్లతో పోల్చిచే బిఎస్-IV ప్రమాణాలను పాటించే ఇంజన్లు తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయి. కాబట్టి బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్లను అన్ని వాహనాలలో ఇప్పుడు తప్పనిసరైంది. బిఎస్ అనగా భారత్ స్టేజ్.