వాహనం కొనుగోలు చేసే ముందు సుప్రీం కోర్టు యొక్క ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి..!!

దేశీయ వాహన రంగంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయాలు... గడువులోపు వివరణ ఇవ్వండంటూ వాహన తయారీ సంస్థలను ఆదేశించిన సుప్రీం కోర్టు....

By Anil

ప్రతి ఏడాది భారత వాహన పరిశ్రమలో కొత్త నియమాలు, కొత్త నిభందనలు అమల్లోకి వస్తుంటాయి. ఎప్పటిలాగే సుప్రీం కోర్టు కొన్ని కొత్త రూల్స్‌ను ప్రకటించింది. ఆ రూల్స్ ఏంటి, వాటి వలన ఎవరికి లాభం గురించి మరిన్ని వివరాలు...

సుప్రీం కోర్టు కొత్త రూల్స్

వచ్చే ఏప్రిల్ 1, 2017 నుండి దేశీయంగా అమ్ముడుపోయే ప్రతి వాహనంలో కూడా బిఎస్-4 ఇంజన్ తప్పనిసరిగా ఉండాలి. అయితే ఇప్పుడు యథావిధిగా బిఎస్-3 ఇంజన్‌లు గల వాహనాలను విక్రయించుకోవచ్చు. అయితే వాహన తయారీ సంస్థలకు తలపోటు తెప్పించే ఆదేశాన్ని సుప్రీం కోర్టు జారీ చేసింది.

సుప్రీం కోర్టు కొత్త రూల్స్

బిఎస్-4 వాహనాలు పరిచయం చేసిన తరువాత, అమ్ముడుపోకుండా నిలిచిపోయిన బిఎస్-3 వెహికల్స్ ఏ మేరకు ఉన్నాయో అనే వివరణ ఇవ్వాలని పేర్కొంది.

సుప్రీం కోర్టు కొత్త రూల్స్

ఇటి ఆటో ప్రకారం, వాహన తయారీ సంస్థలు ఇచ్చే గణాంకాలను బట్టి, బిఎస్-3 నియమాలను పాటించే వాహనాలు గడువులోపు ఎక్కువ సంఖ్యలో తయారీదారుల వద్ద ఉంటే, వాటిని తిరిగి అమ్ముకునే విశయంపై పునరాలోచన చేయనున్నట్లు తెలిసింది.

సుప్రీం కోర్టు కొత్త రూల్స్

అంతే కాకుండా డిసెంబర్ 31, 2015 నుండి ఇప్పటి వరకు ఉత్పత్తి అయిన బిఎస్-3 వాహనాలు వివరాలను వెల్లడించాలని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫ్యాక్చరర్స్(SIAM) ను సుప్రీ కోర్టు కోరింది.

సుప్రీం కోర్టు కొత్త రూల్స్

ఇప్పటి వరకు అమ్ముడుపోకుండా నిలిచిపోయిన బిఎస్-3 ఉద్గార నియమాలను పాటించే వాహనాల వివరాలను సియామ్ కాలుష్య నియంత్రణ మండలికి ఓ నివేదికను సమర్పించింది.

సుప్రీం కోర్టు కొత్త రూల్స్

సియామ్ వెల్లడించిన వివరాలు మేరకు, 20,000 కార్లు మరియు ఎస్‌యూవీలు, 7,50,000 ద్విచక్ర వాహనాలు, 47,000 మూడు చక్రాల వాహనాలు అదే విధంగా 75,000 కమర్షియల్ వాహనాలు ఉన్నట్లు వివరించింది.

సుప్రీం కోర్టు కొత్త రూల్స్

కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏప్రిల్ 1 , 2017 నుండి అన్ని వాహనాలను కూడా బిఎస్- IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌లతో మాత్రమే విక్రయించాలిని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

సుప్రీం కోర్టు కొత్త రూల్స్

అయితే గడువులోపు బిఎస్-III ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌లు ఉన్న వాహనాల స్టాక్‌ పూర్తి చేసేందుకు వాహన తయారీ సంస్థలు అనేక డిస్కౌంట్లు మరియు భారీ ఆఫర్లతో కస్టమర్లకు ఎర వేస్తున్నాయి.

సుప్రీం కోర్టు కొత్త రూల్స్

బిఎస్-III ప్రమాణాలను పాటించే ఇంజన్‌లతో పోల్చిచే బిఎస్-IV ప్రమాణాలను పాటించే ఇంజన్‌లు తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయి. కాబట్టి బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌లను అన్ని వాహనాలలో ఇప్పుడు తప్పనిసరైంది. బిఎస్ అనగా భారత్ స్టేజ్.

Most Read Articles

English summary
Supreme Court Orders Vehicle Manufacturers To Disclose Unsold BS3 Vehicle Numbers
Story first published: Wednesday, March 22, 2017, 11:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X