వంటింటి వ్యర్థాలతో నడిచే భారతదేశపు తొలి బస్సు

భారతదేశపు అతి పెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ దేశీయ తొలి బయో-సిఎన్‌జి(బయో-మీథేన్) బస్సును రూపొందించింది.

By Anil

భారతదేశపు అతి పెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ దేశీయ తొలి బయో-సిఎన్‌జి(బయో-మీథేన్) బస్సును రూపొందించింది. ఉర్జవ్ ఉత్సవ్ అనే పేరుతో జరిగిన బయో ఎనర్జీ ప్రదర్శన వేదిక మీద ఆవిష్కరించింది.

వంటింటి వ్యర్థాలే ఈ బస్సుకు ఇంధనం

కేంద్ర పెట్రోలియ్ మరియు న్యాచురల్ గ్యాస్ మంత్రత్వ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. లైట్ కమర్షియల్ వెహికల్స్(LCV), ఇంటర్మీడియమ్ కమర్షియల్ వెహికల్స్ (ICV) మరియు మీడియమ్ కమర్షియల్ వెహికల్ (MCV) బస్సుల్లో వినియోగించేందుకు బయో-మీథేన్ ఇంధన ఇంజన్‌లను టాటా మోటార్స్ స్వయంగా డిజైన్ చేసి మరియు అభివృద్ది చేసింది.

వంటింటి వ్యర్థాలే ఈ బస్సుకు ఇంధనం

టాటా మోటార్స్ మొత్తం మూడు ఇంజన్‌లను ప్రదర్శించింది. ఇందులో టాప్ ఎండ్ మోడల్‌ ఎల్‌పిఒ 1613 బస్సును ఆవిష్కరించింది. ఎల్‌పిఒ 1613 బస్సులో బిఎస్-IV ఐఒబిడి-II ఉద్గార నియమాలను పాటించే 5.7 ఎస్‌జిఐ ఎన్‌ఎ ఇంజన్ కలదు. పూనేలోఇప్పటికే ఈ బస్సు సేవలందిస్తోంది.

వంటింటి వ్యర్థాలే ఈ బస్సుకు ఇంధనం

సహజ వాయువులతో నడిచే వాహనాలను తయారు చేయడంలో టాటా మోటార్స్ ముందుంది. వెహికల్ పనితీరు మరియు సేఫ్టీ పరంగా సిఎన్‌జి ఇంజన్‌లలో అనేక కొత్త సాంకేతికతలను అభివృద్ది చేసింది టాటా మోటార్స్.

వంటింటి వ్యర్థాలే ఈ బస్సుకు ఇంధనం

టాటా మోటార్స్, కమర్షియల్ వెహికల్ బిజినెస్ హెడ్ గిరీష్ వాఘ్ మాట్లాడుతూ," గ్రీన్ కంట్రీ కోసం ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే మరో వెహికల్‌ను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు. బయో-సిఎన్‌జితో నడిచే వెహికల్స్ వినియోగంతో స్మార్ట్ నగరాల్లో కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నాడు."

వంటింటి వ్యర్థాలే ఈ బస్సుకు ఇంధనం

టాటా మోటార్స్, పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్ విభాగాధిపతి రాజేంద్ర పటేకర్ మాట్లాడుతూ," బయో మీథేన్ బస్సుల ప్రదర్శన పర్యావరణానుకూలమైన వాహనాల అభివృద్దికి మార్గం మరింత సుగమం అవుతోంది, అంతే కాకుండా బయో-మీథేన్ ను వంటింటి వ్యర్థాలతో ఉత్పత్తి చేయవచ్చని చెప్పుకొచ్చారు."

వంటింటి వ్యర్థాలే ఈ బస్సుకు ఇంధనం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సహజ వాయువులతో నడిచే వాహనాలు ఉత్పత్తి చేసే ఉద్గారాలలో కాలుష్య కారకాలు తక్కువగానే ఉంటాయి. పరిశుభ్రమైన వాతావరణం కోసం ఇలాంటి వాహనాల వాడకం ఎంతో అవసరం. బయో-ఇంధన వాడకంతో పెట్రోల్ మరియు డీజల్ వినియోగం తగ్గిపోతుంది. అదే విధంగా ఫ్యూయల్స్ కోసం దేశపు ఖర్చులు గణనీయంగా తగ్గిపోతాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Tata Motors Develops India’s First Bio-Methane Bus
Story first published: Tuesday, July 18, 2017, 16:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X