Just In
- 17 min ago
3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
- 54 min ago
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్ను ఓపెన్ చేసిన బాష్
- 1 hr ago
టీవీఎస్ ఎక్స్ఎల్ 100 విన్నర్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు
- 15 hrs ago
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
Don't Miss
- News
కరోనా అప్డేట్... తెలంగాణలో కొత్తగా 256 కరోనా కేసులు... మరో ఇద్దరు మృతి
- Sports
మ్యాచ్కే హైలైట్! స్టార్క్ షార్ట్ పిచ్ బంతికి.. గిల్ ఎలా సమాధానం ఇచ్చాడో చూడండి వీడియో
- Movies
Master box office: 6వ రోజు కూడా పవర్ఫుల్ కలెక్షన్స్.. విజయ్ మరో బిగ్గెస్ట్ రికార్డ్
- Lifestyle
ప్రతి రాశిచక్రం వారి చింతలను ఎలా నిర్వహించాలో తెలుసా? భాదల నుండి ఇలా భయటపడాలి
- Finance
మారుతీ సుజుకీ కార్ల ధరల షాక్, కార్లపై రూ.34,000 వరకు పెంపు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2020 నాటికి దేశీయ విపణిలోకి టయోటా ఎలక్ట్రిక్ కార్లు
జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టయోటా ఇండియన్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ విడుదల గురించిన ప్రణాళికలు వెల్లడించింది. 2020 నాటికి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు ఈ మధ్యనే ప్రకటించింది.

టయోటా తమ ఎలక్ట్రిక్ కార్లను ముందుగా చైనా విపణిలో లాంచ్ చేసి, ఆ తరువాత ఇండియా, అమెరికా మరియు యూరోపియన్ మార్కెట్లలో తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టనుంది. 2030 నాటికి 10 లక్షల బ్యాటరీ మరియు ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ కార్లతో పాటు మొత్తం 55 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించే అవకాశాలున్నట్లు టయోటా పేర్కొంది.


2020-2030 మధ్య కాలానికి సంభందించిన తమ ప్రణాళికలను టయోటా వెల్లడించింది. ఈ పదేళ్ల కాలంలో హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్లు, బయో ఎలక్ట్రిక్ వెహికల్స్ మరియు ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అభివృద్ది మరియు తయారీ మీద దృష్టిసారించనుంది.

ఇదే కాలంలో లెక్సస్ విక్రయించే మొత్తం వేరియంట్లను ఎలక్ట్రిక్ వెర్షన్లో ప్రవేశపట్టే ఆలోచనలో ఉంది. ప్రపంచ బయో ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయలో భారీ మార్పులు తీసుకొచ్చేందుకు టయోటా ప్రయత్నిస్తోంది. 2020 చివరి నాటికి సుమారుగా 10 రకాల బయో ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ది చేసే లక్ష్యంతో ఉంది.

టయోటా విడుదల చేసిన ఓ ప్రకటనలో, "బయో ఎలక్ట్రిక్ కార్లను ముందుగా చైనా మార్కెట్కు పరిచయం చేసి, తరువాత డిమాండ్ మరియు ఆదరణ అంచనా వేసుకుని మెల్లమెల్లగా జుపాన్, ఇండియా, అమెరికా మరియు యూరోపియన్ మార్కెట్లలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది."

అంతే కాకుండా, 2025 నాటికి టయోటా మరియు లెక్సస్ విక్రయించే అన్ని మోడళ్లు పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వెర్షన్లో అందుబాటులో ఉంచడం లేదంటే తమ కార్లను ఎలక్ట్రిక్ ఆప్షన్స్లో ఎంచుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది.
Trending On DriveSpark Telugu:
కారు స్టార్ట్ కాకపోవడానికి గల రీజన్స్
డీలర్ల వద్ద పట్టుబడిన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 500ఎక్స్
2017లో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన స్కూటర్లు మరియు బైకులు

ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రత్యేకమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, బయో ఎలక్ట్రిక్ వెహికల్స్ మరియు ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ను వీలైనంత త్వరగా అభివృద్ది చేసి, పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంతో వీలవుతుంది.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
2020 లో ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రవేశపెట్టే నిర్ణయాన్ని టయోటా మరియు సుజుకి మధ్య తాజాగా జరిగిన ఒప్పందంలో ఎలక్ట్రిక్ కార్ల గురించి టయోటా తమ భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2030 నాటికి ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయాలకు అనుమతించాలనే భారత ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా టయోటా ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది.
Trending DriveSpark Telugu YouTube Videos