Just In
- 11 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 13 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
- 13 hrs ago MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- 15 hrs ago సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
Don't Miss
- Movies Karthika Deepam 2 పారిజాతం కళ్లలో ఆనందం కోసం బంటు.. దీపను మెప్పించిన కార్తీక్
- News మేషరాశిలో శుక్రుడు.. ఈ రాశులవారికి తీవ్ర అనారోగ్యం.. జాగ్రత్త!!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
2020 నాటికి దేశీయ విపణిలోకి టయోటా ఎలక్ట్రిక్ కార్లు
జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టయోటా ఇండియన్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ విడుదల గురించిన ప్రణాళికలు వెల్లడించింది.
జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టయోటా ఇండియన్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ విడుదల గురించిన ప్రణాళికలు వెల్లడించింది. 2020 నాటికి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు ఈ మధ్యనే ప్రకటించింది.
టయోటా తమ ఎలక్ట్రిక్ కార్లను ముందుగా చైనా విపణిలో లాంచ్ చేసి, ఆ తరువాత ఇండియా, అమెరికా మరియు యూరోపియన్ మార్కెట్లలో తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టనుంది. 2030 నాటికి 10 లక్షల బ్యాటరీ మరియు ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ కార్లతో పాటు మొత్తం 55 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించే అవకాశాలున్నట్లు టయోటా పేర్కొంది.
Recommended Video
2020-2030 మధ్య కాలానికి సంభందించిన తమ ప్రణాళికలను టయోటా వెల్లడించింది. ఈ పదేళ్ల కాలంలో హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్లు, బయో ఎలక్ట్రిక్ వెహికల్స్ మరియు ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అభివృద్ది మరియు తయారీ మీద దృష్టిసారించనుంది.
ఇదే కాలంలో లెక్సస్ విక్రయించే మొత్తం వేరియంట్లను ఎలక్ట్రిక్ వెర్షన్లో ప్రవేశపట్టే ఆలోచనలో ఉంది. ప్రపంచ బయో ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయలో భారీ మార్పులు తీసుకొచ్చేందుకు టయోటా ప్రయత్నిస్తోంది. 2020 చివరి నాటికి సుమారుగా 10 రకాల బయో ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ది చేసే లక్ష్యంతో ఉంది.
టయోటా విడుదల చేసిన ఓ ప్రకటనలో, "బయో ఎలక్ట్రిక్ కార్లను ముందుగా చైనా మార్కెట్కు పరిచయం చేసి, తరువాత డిమాండ్ మరియు ఆదరణ అంచనా వేసుకుని మెల్లమెల్లగా జుపాన్, ఇండియా, అమెరికా మరియు యూరోపియన్ మార్కెట్లలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది."
అంతే కాకుండా, 2025 నాటికి టయోటా మరియు లెక్సస్ విక్రయించే అన్ని మోడళ్లు పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వెర్షన్లో అందుబాటులో ఉంచడం లేదంటే తమ కార్లను ఎలక్ట్రిక్ ఆప్షన్స్లో ఎంచుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది.
Trending On DriveSpark Telugu:
కారు స్టార్ట్ కాకపోవడానికి గల రీజన్స్
డీలర్ల వద్ద పట్టుబడిన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 500ఎక్స్
2017లో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన స్కూటర్లు మరియు బైకులు
ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రత్యేకమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, బయో ఎలక్ట్రిక్ వెహికల్స్ మరియు ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ను వీలైనంత త్వరగా అభివృద్ది చేసి, పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంతో వీలవుతుంది.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
2020 లో ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రవేశపెట్టే నిర్ణయాన్ని టయోటా మరియు సుజుకి మధ్య తాజాగా జరిగిన ఒప్పందంలో ఎలక్ట్రిక్ కార్ల గురించి టయోటా తమ భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2030 నాటికి ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయాలకు అనుమతించాలనే భారత ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా టయోటా ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది.
Trending DriveSpark Telugu YouTube Videos
Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here