Just In
- 7 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 9 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 10 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 12 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆంధ్రప్రదేశ్ - గుంటూరులో రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ ఆటోలు
ఆటో రిక్షాల నుండి వచ్చే ఉద్గారాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్తో నడిచే ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహించాలని జిల్లా అడ్మినిస్ట్రేషన్ విభాగం నిర్ణయించుకుంది.
రోజు రోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం నుండి పట్టణాలను కాపాడుకునేందుకు దేశ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేపడుతున్నాయి. వాహన కాలుష్యాన్ని నియంత్రించడానికి గల చక్కటి ప్రత్యామ్నాయం ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడమే. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల వినియోగాన్ని ప్రోత్సహించే కార్యక్రమం చేపడుతోంది.
ట్రాఫిక్ అంతరాయం కారణంగా పెట్రోల్ మరియు డీజల్ వాహనాలు వెదజల్లే కాలుష్య కారకాల ద్వారా నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఇందులో ప్రత్యేకంగా ఆటో రిక్షాల నుండి వచ్చే ఉద్గారాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్తో నడిచే ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహించాలని జిల్లా అడ్మినిస్ట్రేషన్ విభాగం నిర్ణయించుకుంది.
కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ఆటో డ్రైవర్లు స్వచ్ఛందంగా పెట్రోల్ మరియు డీజల్ ఆటోలను వదిలి ఇ-ఆటో రిక్షాలను కోనుగోలు చేసే విధంగా ప్రోత్సహించడానికి అధికార యంత్రాంగం సిద్దమవుతోంది.
గుంటూరు జిల్లా అధికారి కోన శశిధర్ మరియు జీఎమ్సీ కమీనషనర్ శ్రీకేష్ బి లథ్కర్ మరియు ఇతర అధికార బృందం భారత్ ఆటోమొబైల్ వర్క్స్ తయారు చేసిన ఇ-ఆటోలను పరిశీలించారు. వీటికి ట్రయల్ ట్రన్ నిర్వహించిన అనంతరం వీటి పనితీరు మరియు ప్రయోజనాలు సంతృప్తిని వ్యక్తం చేశారు.
పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ, నగర వ్యాప్తంగా సుమారుగా 30,000 ఆటోలు ఉన్నాయి. గాలి కాలుష్యానికి ఎక్కువగా కారణమవుతున్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా ఇ-ఆటో రిక్షాలను ఉపయోగించేందుకు వీటి రిజిస్ట్రేషన్ మరియు రోడ్డు మీద తిరగడానికి అనుమతులు మంజూరు చేస్తామని వివరించాడు."
నగరంలో ఇప్పటికే పెట్రోల్ లేదా డీజల్ ఆటోల రిజిస్ట్రేషన్ను బ్యాన్ చేశామని పేర్కొన్నారు. ఏ కంపెనీ అయినా సరే మెరుగైన ఫలితాలు అందించే ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తే వినియోగదారులను మరియు తయారీదారులను ప్రోత్సహిస్తామని వెల్లడించారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఎలక్ట్రిక్ ఆటో ధర రూ. 1.5 లక్షలుగా ఉంటే, డీజల్ మరియు ఇతర ఇంధనాలతో నడిచే ఆటోల ధరలు రూ. 3.5 లక్షల వరకు ఉన్నాయి. ఎలక్ట్రిక్-ఆటో రిక్షాలను రీ-ఛార్జ్ చేసుకోవచ్చు మరియు వీటి నిర్వహణ ఖర్చు కూడా తక్కువే.