Just In
- 11 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 13 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 15 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 16 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రోడ్డు ప్రమాద బాధితులకు పది రెట్లు పెరిగిన పరిహారం
రోడ్డు ప్రమాద బాధితులకు చెల్లించే కనీసం పరిహారాన్ని అతి త్వరలో పది రెట్లు పెంచనున్నారు.
రోడ్డు ప్రమాద బాధితులకు చెల్లించే కనీసం పరిహారాన్ని అతి త్వరలో పది రెట్లు పెంచనున్నారు. వయసు మరియు వారి ఆదాయానికి సంభందం లేకుండా రోడ్డు ప్రమాద బాధితులకు చెల్లించే పరిహారాన్ని పది రెట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తాజాగా అందిన సమచారం మేరకు, రోడ్డు ప్రమాదం మరణించినపుడు లేదా శాశ్వత అవయవ లోపం సంభవిస్తే బాధితులకు లేదా బాధితు కుటుంబ సభ్యులకు ఈ పరిహారం మొత్తాన్ని అందజేస్తారు.
బాధితులకు చెల్లించే ఈ నష్టపరిహారాన్ని 24 సంవత్సరాల తరువాత సవరించారు. అయితే, బాధితులు అధిక పరిహారానికి అర్హులని భావిస్తే, తమ యాక్సిడెంట్ కేసులను మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ద్వారా కొనసాగించుకునే అవకాశం కల్పించింది.
ప్రభుత్వ నూతన నిభందనల మేరకు, ప్రమాదంలో మరణం సంభవిస్తే బాధితుల సంబంధీకులకు 5 లక్షల రుపాయల పరిహారాన్ని అందజేస్తారు. నిబంధనల మేరకు శాశ్విత అవయవ లోపం సంభవిస్తే రూ. 50,000 నుండి రూ. 5 లక్షల పరిహారాన్ని అందిస్తారు.
ఇక మీదట ఈ నష్ట పరిహారాన్ని ప్రతి ఏడాది 5 శాతం మేర పెంచనున్నారు. ప్రమాదంలో బాధితులు త్వరగా కోలుకునేందుకు కేంద్రం ఈ నిర్ణం తీసుకుంది. గణాంకాల ప్రకారం, రోడ్డు ప్రమాదాల్లో ప్రతి ఏడాది 1.5 లక్షల మంది మరణిస్తున్నారు. మరో 5 లక్షల మంది గాయపడుతున్నారు.
ప్రస్తుతం, బాధితుల తప్పిదం లేనపుడు, ప్రమాదాల్లో మరణించిన వారికి రూ. 50,000 లు పరిహారాన్ని చెల్లిస్తున్నారు. అదే విధంగా ప్రమాదాల్లో శాశ్వత అవయవ లోపం సంభవించిన వారికి రూ. 25,000 లు చెల్లిస్తున్నారు.
అయితే, తాజాగా తీసుకున్న నిర్ణయంతో తప్పుఒప్పుల లెక్కలు అవసరం లేదు. ప్రమాదం బాధితులు ఎవరైనప్పటికీ, అందరికీ నష్టపరిహారం అందుతుంది. ఇత మీదట అన్ని కేసులు MACT సమక్షంలో సమాప్తం కానున్నాయి.
చట్టంలోని నిర్మాణాత్మక సూత్రాల ఆధారంగా MACT బాధితులకు నష్టపరిహారాన్ని నిర్ణయిస్తుంది. ఈ పరిహారం బాధితుల వయస్సు, ఆదాయం మరియు బాధితుడి మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల సంఖ్య వంటి అంశాలను లెక్కలోకి తీసుకుంటారు.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మోటార్ వాహనాల చట్టంలో ఎన్నో రకాల సవరణలు జరిగాయి. కానీ, ఇప్పటి వరకు రోడ్డు ప్రమాద బాధితులకు చెల్లించే నష్ట పరిహారం విషయంలో ఎలాంటి సవరణలు జరగలేదు. పెండింగులో ఉన్న కేసులను తగ్గించే ఉద్దేశ్యంతోనే ఈ సవరణ జరిగినట్లు తెలిసింది. అయితే, బాధితులు మరింత ఎక్కువ నష్ట పరిహారాన్ని కోరుకుంటే ఆ తరువాత చట్ట పరంగా వెళ్లాల్సి ఉంటుంది.
1.2018 హోండా అమేజ్ విడుదల: ధర రూ. 5.59 లక్షలు
2.టాటా నుండి మారుతి బాలెనోకు ఊహించని ఎదురుదెబ్బ
3.ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ప్రభుత్వం నుండి 2.5 లక్షల నజరానా
4.కిమ్ జాంగ్ ఉన్ ఎక్కడికి వెళ్లినా ఈ కారు ఖచ్చితంగా వెన్నంటే ఉంటుంది