ఫోర్స్ గుర్ఖా ఎక్స్‌ట్రీమ్ ప్రత్యేకతలు తెలిస్తే మహీంద్రా థార్‌కు గుడ్ బై చెప్పేస్తారు!!

ఫోర్స్ మోటార్స్ గుర్ఖా స్పెషల్ యుటిలిటి వెహికల్‌ను మరో కొత్త వేరియంట్లో విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది. తాజాగా అందిన సమాచారం మేరకు, ఫోర్స్ గుర్ఖా ఆఫ్ రోడ్ ఎస్‌యూవీని ఎక్స్‌ట్రీమ్ వేరియంట్లో వ

By Anil Kumar

ఫోర్స్ మోటార్స్ గుర్ఖా స్పెషల్ యుటిలిటి వెహికల్‌ను మరో కొత్త వేరియంట్లో విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది. తాజాగా అందిన సమాచారం మేరకు, ఫోర్స్ గుర్ఖా ఆఫ్ రోడ్ ఎస్‌యూవీని ఎక్స్‌ట్రీమ్ వేరియంట్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది.

ఫోర్స్ గుర్ఖా ఎక్స్‌ట్రీమ్ ప్రత్యేకతలు తెలిస్తే మహీంద్రా థార్‌కు గుడ్ బై చెప్పేస్తారు!!

గుర్ఖా ఎక్స్‌ట్రీమ్ ఎక్ట్సీరియర్ డిజైన్ చూడటానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న గుర్ఖా ఎస్‌యూవీనే పోలి ఉంటుంది. అయితే, స్వల్ప మార్పులతో పాటు సాంకేతికంగా మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రత్యేకించి రెగ్యులర్ మోడల్ కంటే ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఫోర్స్ గుర్ఖా ఎక్స్‌ట్రీమ్ ప్రత్యేకతలు తెలిస్తే మహీంద్రా థార్‌కు గుడ్ బై చెప్పేస్తారు!!

ఫోర్స్ గుర్ఖా ఎక్స్‌ట్రీమ్ ఆఫ్ రోడ్ ఎస్‌యూవీలో మెర్సిడెస్-బెంజ్ నుండి సేకరించిన ఓఎమ్611-ఇంజన్ కలదు. ఈ 2.2-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ 138బిహెచ్‌పి పవర్ మరియు 321ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది గతంలో ఉన్న 2.6-లీటర్ డీజల్ ఇంజన్ స్థానాన్ని భర్తీ చేస్తుంది.

ఫోర్స్ గుర్ఖా ఎక్స్‌ట్రీమ్ ప్రత్యేకతలు తెలిస్తే మహీంద్రా థార్‌కు గుడ్ బై చెప్పేస్తారు!!

ఫోర్స్ గుర్ఖా ఎక్స్‌ట్రీమ్ ఎస్‌యూవీలో మెర్సిడెస్-బెంజ్ నుండి సేకరించిన ఇంజన్‌తో పాటు మెర్సిడెస్-బెంజ్ జి32 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు. ఇతర విడి భాగాలైన లో-రేంజ్ ట్రాన్స్‌ఫర్ కేజ్, ఫ్రంట్ మరియు రియర్ డిఫరెన్షియల్ లాక్స్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు.

ఫోర్స్ గుర్ఖా ఎక్స్‌ట్రీమ్ ప్రత్యేకతలు తెలిస్తే మహీంద్రా థార్‌కు గుడ్ బై చెప్పేస్తారు!!

పర్ఫామెన్స్ పెంచే మెరుగైన సస్పెన్షన్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేశారు. నూతన సస్పెన్షన్ సిస్టమ్ గల గుర్ఖా ఎక్స్‌ట్రీమ్ అప్రోచ్, డిపార్చర్ మరియు బ్రేక్ఓవర్ యాంగిల్స్‌లో మునుపటి స్టాండర్డ్ వెర్షన్ కంటే అత్యుత్తమ ఫలితాలు కనబరచింది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 205ఎమ్ఎమ్ మరియు నీటిలో గరిష్టంగా 550ఎమ్ఎమ్ లోతు వరకు వెళ్లగలదు.

ఫోర్స్ గుర్ఖా ఎక్స్‌ట్రీమ్ ప్రత్యేకతలు తెలిస్తే మహీంద్రా థార్‌కు గుడ్ బై చెప్పేస్తారు!!

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, ఫోర్స్ గుర్ఖా ఎక్స్‌ట్రీమ్ వేరియంట్ జూన్ 2018లో ఇండియన్ మార్కెట్లోకి అధికారికంగా విడుదల కానుంది. డీలర్లు ఇప్పటికే ఫోర్స్ గుర్ఖా ఎక్స్‌ట్రీమ్ మీద బుకింగ్స్ కూడా ప్రారంభించారు.

ఫోర్స్ గుర్ఖా ఎక్స్‌ట్రీమ్ ప్రత్యేకతలు తెలిస్తే మహీంద్రా థార్‌కు గుడ్ బై చెప్పేస్తారు!!

ఫోర్స్ గుర్ఖా ఎక్స్‌ప్లోరర్ కంటే గుర్ఖా ఎక్స్‌ట్రీమ్ వేరియంట్ ధర తక్కువగా ఉండనుంది. పరిశ్రమ నిపుణుల అంచనా మేరకు, ఎక్స్‌ట్రీమ్ ఎస్‌యూవీ ధర సుమారుగా రూ. 14 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

ఫోర్స్ గుర్ఖా ఎక్స్‌ట్రీమ్ ప్రత్యేకతలు తెలిస్తే మహీంద్రా థార్‌కు గుడ్ బై చెప్పేస్తారు!!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అత్యుత్తమ పవర్ మరియు పనితీరును ప్రదర్శించే ఫోర్స్ గుర్ఖా ఎక్స్‌ట్రీమ్ ఎస్‌యూవీ మెరుగైన ఆఫ్ రోడర్ అని చెప్పవచ్చు. ఇది విపణిలో ఉన్న మహీంద్రా థార్ ఆఫ్ రోడ్ ఎస్‌యూవీకి గట్టి పోటీనిస్తుంది.

ఫోర్స్ గుర్ఖా ఎక్స్‌ట్రీమ్ ప్రత్యేకతలు తెలిస్తే మహీంద్రా థార్‌కు గుడ్ బై చెప్పేస్తారు!!

ఇప్పటి వరకు ఫోర్స్ గుర్ఖా చెప్పుకోదగ్గ రికార్డు సేల్స్ సాధించలేదు. అయితే, ఇండియాలో క్రమంగా పెరుగుతున్న ఆఫ్ రోడ్ ప్రియులు మరియు ఎప్పుటికప్పుడు అప్‌డేటెడ్ వెర్షన్‌లో వస్తున్న గుర్ఖా ఎస్‌యూవీల ద్వారా సేల్స్ పెరిగే అవకాశం ఉంది.

Source: Autocar India

Most Read Articles

English summary
Read In Telugu: Force Gurkha Xtreme To Be Launched In India — Technical Details Revealed
Story first published: Wednesday, June 20, 2018, 17:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X