Just In
- 5 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 6 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 10 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 11 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
400 అడుగుల లోయలోకి పడిపోయిన ఎండీవర్: 7 మంది ప్రయాణికులు సేఫ్!!
ఉదయం ఆరు గంటల సమయంలో, తనకు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించడానికి జిత్తేంద్ర సింగ్ కొద్దిగా లెఫ్ట్కు స్టీరింగ్ తిప్పాడు. ఊహించని విధంగా తనతో పాటు ప్రయాణిస్తున్న మొత్తం 7 మంది ఉన్న ఫోర్డ్ ఎండీవర్ ఎస
Recommended Video
ఉదయం ఆరు గంటల సమయంలో, తనకు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించడానికి జిత్తేంద్ర సింగ్ కొద్దిగా లెఫ్ట్కు స్టీరింగ్ తిప్పాడు. ఊహించని విధంగా తనతో పాటు ప్రయాణిస్తున్న మొత్తం 7 మంది ఉన్న ఫోర్డ్ ఎండీవర్ ఎస్యూవీ అదుపుతప్పి 400 అడుగుల లోయలోకి పడిపోయింది. అదృష్టవశాత్తు, తనతో పాటు తన కుంటుంబం మొత్తం ఆ భయంకరమైన ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడింది.
ఇండియన్ రోడ్ల మీద ఇప్పటి వరకు జరిగిన ఎన్నో ఫోర్డ్ ఎండీవర్ ప్రమాదాల్లో ప్రయాణికులను సురక్షితంగా కాపాడింది. అలాంటి వారిలో జిత్తేంద్ర సింగ్ ఒకరు. ఫోర్డ్ ఎండీవర్, తనను తన కుటుంబాన్ని ప్రమాదపుటంచుల నుండి ప్రాణాలతో సురక్షితంగా బయపడేసింది.
జిత్తేంద్ర సింగ్ తన కుటుంబంతో సరదాగా గడపడానికి మహారాష్ట్రలోని వసాయ్ నుండి సింధూదుర్గ్ జిల్లాలోని కన్కావలి ప్రాంతానికి వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రక్క లైన్లో ఎదురుగా వస్తున్న ట్యాంకర్ ఉన్నట్లుండి తన మార్గంలోకి రావడంతో, దానిని తప్పించడానికి వాహనాన్ని కొద్దిగా ఎడమవైపుకు మళ్లించాడు.
రోడ్డు చాలా ఇరుకుగా ఉండటంతో రోడ్డుకు ప్రక్కనే ఉన్న బారికేడ్ను ఢీకొట్టి లోయలోకి పడిపోయింది. పల్టీలుకొడుతూ సుమారుగా 400 అడుగులు లోతులోకి ఎస్యూవీ పడిపోయింది. దీన్ని చూసిన డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు.
అతి ఘోరమైన ఈ ప్రమాదం నుండి ఫోర్డ్ ఎండీవర్లో ప్రయాణిస్తున్న అందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగినపుడు ఎండీవర్ డ్రైవర్ మరియు జిత్తేంద్ర సింగ్ మాత్రమే సీట్ బెల్ట్ ధరించారు.
ఎండీవర్ ఎస్యూవీ లోయలోకి పడిపోయినపుడు జిత్తేంద్ర సింగ్ భార్య పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగినపుడు ఎస్యూవీలోని ఆరు ఎయిర్బ్యాగులు విచ్చుకోవడంతో అందరూ తప్పించుకున్నారు.
ఫోటోలలోని నుజ్జునుజ్జుయిన ఫోర్డ్ ఎండీవర్ చూస్తే ప్రమాద తీవ్రత ఏ మేరకు ఉందో చెప్పవచ్చు. రూఫ్ టాప్ మరియు ఎస్యూవీ ముందు భాగంగా పూర్తిగా దెబ్బతినింది.
ఏదేమైనప్పటికీ, 400 అడుగుల లోయలోకి పడిపోయినప్పటికీ ఫోర్డ్ ఎండీవర్ సస్పెన్షన్ మరియు చక్రాలు చెక్కుచెదరలేదు. ఇంజన్ మరియు అన్ని విడి భాగాలు ఎస్యూవీ నుండి వేరు పడకుండా అలాగే ఉన్నాయి.
ఈ ప్రమాదం సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరిని చెబుతోంది. సీట్ బెల్ట్ ధరించకపోయినా, ఇందులోని ఎయిర్బ్యాగులు విచ్చుకుని అందరినీ రక్షించాయి. సీట్ బెల్ట్ కూడా ధరిస్తే పెద్ద పెద్ద గాయాలను తప్పించుకోవచ్చు.
చాలా వాహనాల్లో ఆరు ఎయిర్ బ్యాగులు తప్పనిసరిగా ఉండకపోవచ్చు, కానీ అన్ని కార్లలో సీట్ బెల్టులు ఖచ్చితంగా ఉంటాయి. ప్రమాదాలు చెప్పిరావు కాబట్టి, కారులో ప్రయాణం ప్రారంభించే ముందు ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించండి.
ఫోర్డ్ ఎండీవర్ గురించి
అమెరికా దిగ్గజం ఫోర్డ్ ఇండియన్ మార్కెట్లోని ప్రీమియమ్ ఎస్యూవీ సెగ్మెంట్లోకి టయోటా ఫార్చ్యూనర్కు పోటీగా ఎండీవర్ ఎస్యూవీని తీసుకొచ్చింది. ఫోర్డ్ ఎండీవర్ 2.2-లీటర్ డీజల్ మరియు 3.2-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ వేరియంట్లలో టూ వీల్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్తో లభ్యమవుతోంది.
Image Source: Rushlane, HP Live