Just In
- 11 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 12 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 13 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 14 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలపై దిగొచ్చిన జీఎస్టీ
ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే బ్యాటరీల మీద ప్రభుత్వం ఎట్టకేలకు 10 శాతం జీఎస్టీ తగ్గించింది. భారత ప్రభుత్వ సూచన మేరకు, జీఎస్టీ మండలి ప్రస్తుతం లిథియం-అయాన్ బ్యాటరీల మీద ఉన్న 28 శాతం జీఎస్టీని 18 శాతాని
ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే బ్యాటరీల మీద ప్రభుత్వం ఎట్టకేలకు 10 శాతం జీఎస్టీ తగ్గించింది. భారత ప్రభుత్వ సూచన మేరకు, జీఎస్టీ మండలి ప్రస్తుతం లిథియం-అయాన్ బ్యాటరీల మీద ఉన్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించింది. బ్యాటరీల మీద జీఎస్టీ రేట్లు తగ్గడంతో, దేశీయంగా ఉన్న అన్ని రకాల ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గుముఖం పడతాయి.
ఎలక్ట్రిక్ వాహనాలలో బ్యాటరీ అత్యంత కీలకమైన విడి భాగం. ఈ బ్యాటరీల మీద జీఎస్టీ తగ్గడంతో ఎలక్ట్రిక్ వాహనాల మొత్తం ధరలో సుమారుగా 8 నుండి 10 శాతం వరకు ధరలు తగ్గుతాయి. ప్రస్తుతం టాటా మోటార్స్ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి.
ఎలక్ట్రిక్ కార్ల తయారీకి కావాల్సిన బ్యాటరీలను మరియు ఇతర విడి భాగాలను ముందుగానే సేకరించుకోవడం వలన ఎలక్ట్రిక్ కార్ల ధరలు వెంటనే తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లు కొంత కాలం పాటు పాత ధరలకే అందుబాటులో ఉంటాయి.
అయితే, పాత స్టాక్ క్లియర్ అయిన తర్వాత కొత్త బ్యాచ్ ప్రొడక్షన్ ప్రారంభమయితే, బ్యాటరీల మీద తగ్గిన జీఎస్టీకి అనుగుణంగా ఎలక్ట్రిక్ కార్ల ధరలను తగ్గించే అవకాశం ఉంది. టాటా మరియు మహీంద్రా అండ్ మహీంద్రా ఇరు కంపెనీలు కూడా అతి త్వరలో తమ ఎలక్ట్రిక్ కార్ల ధరలను సవరించే అకాశం ఉంది.
లిథియం-అయాన్ బ్యాటరీల మీద 10 శాతం జీఎస్టీ తగ్గించడం వలన ఎలక్ట్రిక్ కార్లతో పాటు దేశీయ మార్కెట్లో ఉన్న పలు ఎలక్ట్రిక్ టూ వీలర్ల కంపెనీలు కూడా లబ్ధి పొందనున్నాయి. దీంతో అతి త్వరలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల ధరలు కూడా కొద్ది వరకు తగ్గే అవకాశం ఉంది.
ఎలక్ట్రిక్ బ్యాటరీల మీద జీఎస్టీ తగ్గింపు పరంగా తీసుకున్న నిర్ణయం, కంపెనీలు స్వచ్ఛదంగా తమకు కావాల్సిన బ్యాటరీలను దిగుమతి చేసుకోకుండా పూర్తి స్థాయిలో దేశీయంగా తయారు చేసుకునేందుకు సహాయపడనుంది. ప్రస్తుతం, దిగుమతి చేసుకుంటున్న ఎలక్ట్రిక్ బ్యాటరీల మీద దిగుమతి సుంకం 20 శాతంగా ఉంది.
ఎలక్ట్రిక్ కార్లు మరియు టూ వీలర్లు పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకునే లిథియం-అయాన్ బ్యాటరీల మీదనే ఆధారపడ్డాయి. ఒకవేళ ఈ బ్యాటరీల తయారీ దేశీయంగా మొదలైతే ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
భవిష్యత్ ప్రజా రవాణాలో ఎలక్ట్రిక్ వాహనాలదే పైచేయి కానుంది. దీంతో ఇప్పటికే పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ది చేసుకుంటున్నాయి. అయితే, పెట్రోల్ మరియు డీజల్ వాహనాలతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ కార్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించే బ్యాటరీల మీద 10 శాతం వరకు జీఎస్టీ తగ్గడంతో ఇక మీదట ఎలక్ట్రిక్ వాహనాల ధరలు దిగివచ్చి సామాన్యులకు చౌకగా లభించనున్నాయి.