Just In
- 16 min ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 1 hr ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 3 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 6 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News YS Jagan పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
- Lifestyle అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- Sports IPL 2024 ఫిక్సింగ్ కలకలం.. నలుగురు అరెస్ట్!
- Movies పడక గదిలోకి వెళ్లందే ఆఫర్లు రావు.. టాప్ సింగర్పై మండిపడ్డ నటి కస్తూరి
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
జీఎస్టీ రాకతో వాహన పరిశ్రమకు కలిగి ఏకైక ప్రయోజనం
ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల మీద జీఎస్టీ రేట్లను తగ్గించడానికి జీఎస్టీ కౌన్సిల్ సిద్దమైంది. దీంతో ఎలక్ట్రిక్ కార్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.
భారత ప్రభుత్వం వస్తు మరియు సేవల పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తరువాత దేశీయ వాహన పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. జీఎస్టీ అమలుతో చిన్న కార్ల నుండి విలాసవంతమైన లగ్జరీ కార్లతో పాటు పర్యావరణ హితమైన హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్ మీద తీవ్ర ప్రభాం చూపింది.
దాదాపు అన్ని వాహనాల మీద నిర్ణయించిన ట్యాక్స్ స్లాబులను తయారీ సంస్థలు అంగీరించాయి. అయితే ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ కార్ల మీద జీఎస్టీకి అనుగుణంగా నిర్ణయించిన పన్నులు ఇటు కంపెనీలకు అటు కొనుగోలుదారులకు భారంగా మారాయి.
ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల మీద జీఎస్టీ రేట్లను తగ్గించడానికి జీఎస్టీ కౌన్సిల్ సిద్దమైంది. దీంతో ఎలక్ట్రిక్ కార్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. బ్యాటరీల మీద ఉన్న 28 శాతం జీఎస్టీ పన్ను రేటును 12 శాతానికి తగ్గించాలని భారత ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఎలక్ట్రిక్ కార్లలో ఇతర విడి భాగాలతో పోల్చితే బ్యాటరీలు అత్యంత ఖరీదైనవి. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పుంజుకోవడం మరియు భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ కార్లదే అని గ్రహించిన కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్ల తయారీ మరియ మార్కెట్ మీద దృష్టిసారిస్తుండటంతో ఈ దిశగా మార్పును కోరుకుంటూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
దేశీయ వాహన పరిశ్రమలో ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా మరియు టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది, తయారీ మరియు మార్కెటింగ్ మీద దృష్టిసారించాయి. తాజాగా తీసుకున్న నిర్ణయంతో బ్యాటరీ ధరలు తగ్గితే, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఖర్చు భారీగా దిగిరానుంది.
కేంద్రం ఎలక్ట్రిక్ కార్ల తయారీలో అవసరమయ్యే విడి భాగాల మీద జీఎస్టీ రేట్లను తగ్గించడంతో దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ మరియు అసెంబ్లీ మరింత పుంజుకోనుంది. మహీంద్రా మరియు టాటాతో పాటు ఇతర సంస్థలు కూడా ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.
ప్రస్తుతం, ఎలక్ట్రిక్ కార్లు మరియు వాహనాల కోసం కావాల్సిన బ్యాటరీలను చైనా మరియు అమెరికా దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. దేశీయంగా బ్యాటరీల మీద జీఎస్టీ ట్యాక్స్ రేట్ తగ్గినప్పటికీ దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ కార్ల మీద ఎలాంటి ప్రభావం ఉండదు.
ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల ధరలను డాలరుకు కిలోవాట్గా ($/kWh) నిర్ణయిస్తారు. 2010లో kWh చొప్పున బ్యాటరీ ధర $1000 (రూ.67,392)గా ఉండేది అయితే ఇప్పటి నుండి ఈ ధర కొద్దికొద్దిగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం, kWh చొప్పున ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ ధరలు 225 నుండి 250 డాలర్లుగా (రూ. 15,163 నుండి 16,949) ఉన్నాయి. బ్లూమ్బర్గ్ అధ్యయనం ప్రకారం 2026 నాటికి ఈ ధర $100(రూ. 6,739)లకు దిగి వచ్చే అవకాశం ఉంది.
*అన్ని ధరలను మే 12, 2018 మారకపు రేట్ల ఆధారంగా ఇవ్వడం జరిగింది.
ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు దిశగా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు, ఇండియన్ రోడ్ల మీద తిరిగే ఎలక్ట్రిక్ వాహనాలకు గ్రీన్ నెంబర్ ప్లేట్ విధానాన్ని అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది.
ఈ నియమం ప్రకారం, సొంతం అవసరాల కోసం వినియోగించే కార్లకు గ్రీన్ బోర్డు మరియు తెలుపు రంగు అక్షరాలు ప్లేట్ మరియు వాణిజ్యపరమైన అవసరాలకు ఉపయోగించే వాహనాలకు గ్రీన్ ప్లేట్-పసుపు రంగు అక్షరాలు గల నెంబర్ ప్లేట్లు రానున్నాయి.
అదనంగా ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించే వారికోసం, పార్కింగ్ ప్రదేశాల్లో అధిక ప్రాధాన్యమివ్వడం, ఇరుకైన మరియు రద్దీ రోడ్లలో ఉచిత ఎంట్రీ అదే విధంగా జాతీయ రహదారులు మరియు టోలో ప్లాజాల వద్ద రాయితీ వంటి లాభాలను ప్రతిపాదించింది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎలక్ట్రిక్ వాహనాలకు పర్మిట్లు నుండి మినహాయించింది.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
నగర వీధుల్లో సంచరించే పెట్రోల్ మరియు డీజల్ వాహనాల సంఖ్య పెరిగిపోవడంతో వాతావరణ కాలుష్యం రోజురోజుకీ పెచ్చుమీరుతోంది. అంతర్జాతీయంగా, పలు కార్ల తయారీ సంస్థలు నెమ్మదిగా ఎలక్ట్రిక్ వాహన తయారీని చేపడుతున్నాయి. వాహన కాలుష్య నివారణకు ప్రధానంగా ఉన్న ప్రత్యామ్నాయం ఎలక్ట్రిక్ వాహనాలు. పెట్రోల్ మరియు డీజల్ కార్లను ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే దిశగా భారత ప్రభుత్వం ఎన్నో ప్రోహాత్సకాలను అందించి, ప్రజలను చైతన్యపరుస్తోంది.