Just In
- 1 hr ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 1 hr ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 2 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 4 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మిత్సుబిషి పజేరో ఎస్యూవీకి శాస్వత వీడ్కోలు
మిత్సుబిషి అతి త్వరలో తమ పజేరో ఎస్యూవీని యూరోపియన్ మార్కెట్ నుండి శాస్వతంగా తొలగించనుంది. తక్కువ సేల్స్ మరియు కఠినమైన ఉద్గార ప్రమాణాలను పాటించలేకపోవడంతో మిత్సుబిషి పజేరో ఎస్యూవీ విషయంలో ఈ నిర్ణయం తీ
జపాన్కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ మిత్సుబిషి అతి త్వరలో తమ పజేరో ఎస్యూవీని యూరోపియన్ మార్కెట్ నుండి శాస్వతంగా తొలగించనుంది. తక్కువ సేల్స్ మరియు కఠినమైన ఉద్గార ప్రమాణాలను పాటించలేకపోవడంతో మిత్సుబిషి పజేరో ఎస్యూవీ విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
మిత్సుబిషికి ప్యాసింజర్ వాహన విభాగంలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన మోడళ్లలో ఒకటైన పజేరో ఎస్యూవీని అతి కష్టం మీద విపణి నుండి తొలగిస్తున్న నేపథ్యంలో మిత్సుబిషి పజేరో అభిమానుల కోసం ఫైనల్ ఎడిషన్ పజేరోను సిద్దం చేస్తోంది. మిత్సుబిషి 1982లో మొదటిసారిగా పజేర్ ఎస్యూవీని ప్రపంచానికి పరిచయం చేసింది.
ఇప్పుడు, మిత్సుబిషి తమ పజేరో చరిత్రకు గుర్తుగా ఫైనల్ ఎడిషన్ పజేరో ఎస్యూవీని ఆవిష్కరించింది. ఇది, మూడు మరియు ఐదు డోర్ల వేరియంట్లలో లభించనుంది. మిత్సుబిషి ఈ స్పెషల్ ఎడిషన్ ఎస్యూవీని పరిమిత సంఖ్యలో మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. మొత్తం 1000 యూనిట్లలో 300 మూడు డోర్ల వేరియంట్లు, 700 ఐదు డోర్ల వేరియంట్లను సిద్దం చేస్తోంది.
మిత్సుబిషి పజేరో ఫైనల్ ఎడిషన్ ప్రతి యూనిట్ మీద ప్రత్యేకమైన నెంబరింగ్ ఉంటుంది. మూడు డోర్ల వెర్షన్ ఎస్యూవీలో ఫ్రంట్ బార్, 4ఎమ్ఎమ్ మందంతో ఉన్న అల్యూమినియం ఫ్రంట్ స్కిడ్ ప్లేట్, ప్రత్యేకమైన ఏ/టి టైర్లు ఉన్న 18-అంగుళాల ఆఫ్ రోడ్ వీల్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లయిన, రూఫ్ రెయిల్స్, హెడ్ల్యాంప్ వాషర్స్, క్రూయిజ్ కంట్రోల్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ హెడ్ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, హీటెడ్ ఫ్రంట్ మిర్రర్, బ్లూటూత్ కనెక్టివిటి గల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇంజన్ మరియు గేర్బాక్స్ను రక్షించే అల్యూమినియం అండర్ బాడీ స్కిడ్ ప్లేట్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.
పజేరో ఫైనల్ ఎడిషన్ 5-డోర్ వెర్షన్ విషయానికి వస్తే, ఇందులో 20-అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, రియర్ స్పాయిలర్ మరియు ఇల్యూమినేటెడ్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇంటీరియర్లో లెథర్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్రూఫ్ మరియు న్యావిగేషన్ గల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మిత్సుబిషి పజేరో ఫైనల్ ఎడిషన్ లభించే 3 మరియు 5 డోర్లు గల రెండు వెర్షన్లలో సాంకేతికంగా 3.2-లీటర్ల కెపాసిటి గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్బాక్స్ మరియు సూపర్ సెలెక్ట్ 4WD-II పర్మినెంట్ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ అనుసంధానం గల ఇది 187బిహెచ్పి పవర్ మరియు 441ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మిత్సుబిషి ఎట్టజకేలకు తమ పజేరో ఎస్యూవీని యూరోపియన్ మార్కెట్ నుండి శాస్వతంగా తొలగించాలని నిర్ణయించుకుంది. ఆశించిన సేల్స్ లేకపోవడం మరియు అత్యంత కఠినమైన యూరోపియన్ ఉద్గార నియమాలను పాటించలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అని తెలుస్తోంది. పజేరో చరిత్రను గుర్తుకు చేసుకునేందుకు చివరిగా 1000 యూనిట్ల పజేరో ఎస్యూవీలను ఫైనల్ ఎడిషన్గా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్దమైంది. పజేరో ప్రేమికులకు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
భారత్లో మిత్సుబిషి మోంటెరో మరియు పజేరో వాహనాలను విజయవంతంగా విక్రయిస్తోంది. కాబట్టి, దేశీయంగా ఫైనల్ ఎడిషన్ పజేరో ఊసే ఉండదని చెప్పవచ్చు.
1. టాటా నెక్సాన్ ఏఎమ్టి మీద బుకింగ్స్ షురూ
2.ఎప్పటికీ మరచిపోలేని టైటానిక్ విషాదం గురించి నగ్న సత్యాలు
3.అంబాసిడర్ బ్రాండుకు మళ్లీ ప్రాణం పోస్తున్న ప్యూజో