Just In
- 32 min ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 2 hrs ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- 4 hrs ago బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- 5 hrs ago జనరల్ టికెట్ ప్యాసింజర్స్తో ఫుల్ రష్గా రిజర్వ్డ్ కోచ్లు.. ప్రయాణికుడి కంప్లెయింట్, రైల్వే శాఖ సీరియస్
Don't Miss
- News మోదీ ప్రధాని అయ్యే వరకు నిద్రపోము, ఎవరు మునిగిపోతారో జూన్ 4వ తేదీ తెలుస్తుంది సీఎం గారు !
- Movies The GOAT Life Review పృథ్వీరాజ్ సుకుమారన్ వన్ మ్యాన్ షో.. కానీ సహనానికి పరీక్షే.. ఆడుజీవితం సినిమా సమీక్ష
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Technology Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
15 మారుతి కార్లలో కొత్త సేఫ్టీ రూల్స్ పాటించినవి 9 కార్లు మాత్రమే
మారుతి సుజుకి అత్యధికంగా 15 కార్లను అందుబాటులో ఉంచింది మరియు ఇండియాలో అత్యధిక సేల్స్ సాధిస్తున్న కంపెనీ కూడా మారుతీనే. ప్రస్తుతం మారుతి వద్ద ఉన్న 15 మోడళ్లలో 9 కార్లు భారతదేశపు నూతన క్రాష్ టెస్ట్ ప్రమ
కారు కొనాలనే ఆలోచనలో ఉన్నవారు మైలేజ్, ధర, ఇంజన్, పర్ఫామెన్స్, డిజైన్ మరియు ఫీచర్ల మీదనే ఎక్కువ దృష్టిసారిస్తారు. కానీ, కారు సేఫ్టీ మరియు భద్రత పరంగా కారులో ఉన్న సేఫ్టీ టెక్నాలజీ గురించి అస్సలు పట్టించుకోరు.
ఇండియాలో అయితే ఈ ధోరణి మరీ దారుణంగా ఉంది. కస్టమర్ల సంగతి పక్కనపెడితే, కొత్త కార్లను విడుదల చేసేందుకు అనుమతులు మంజూరు చేసే ప్రభుత్వం కూడా వాటి భద్రతను గాలికి వదిలేస్తోంది.
విదేశీ మరియు దేశీయ మార్కెట్లకు ఉన్నా తేడా అదే. ఇక్కడైతే, ఎలాంటి కార్లనైనా అమ్మేయొచ్చు. కానీ, అంతర్జాతీయ విపణిలో అలా కాదు, విడుదలకు సిద్దమైన ప్రతి కారు కూడా సేఫ్టీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. క్రాష్ టెస్టులో ఫెయిల్ అయిన కార్లు వెనక్కి వచ్చేయాల్సిందే.
ఒక్కో దేశం ఒక్కోరకమైన భద్రత ప్రమాణాలను పాటిస్తోంది. కానీ, ఇండియాలో ఇప్పటి వరకు సేఫ్టీ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం(NCAP)ను భారత ప్రభుత్వం ప్రారంభించలేదు. దీంతో కనీస నిర్మాణ నాణ్యత మరియు సేఫ్టీ ఫీచర్లు లేని కార్లు కుప్పలుతెప్పలుగా విడుదలవుతున్నాయి.
తక్కువ ధరలో లభిస్తున్నాయనే ఉద్దేశ్యంతో సొంత కారు కలను నిజం చేసుకునేందుకు భద్రత ప్రమాణాలు పాటించని, సేఫ్టీ ఫీచర్లు లేనటువంటి కార్లను కొనేస్తున్నారు. ఇండియాలో కనీస భద్రత ప్రమాణాలను పాటించని కార్లే అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. దీంతో ఏ చిన్న ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడే అవకాశాన్ని కోల్పోతున్నారు.
దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అత్యధికంగా 15 కార్లను అందుబాటులో ఉంచింది మరియు ఇండియాలో అత్యధిక సేల్స్ సాధిస్తున్న కంపెనీ కూడా మారుతీనే. ప్రస్తుతం మారుతి వద్ద ఉన్న 15 మోడళ్లలో 9 కార్లు భారతదేశపు నూతన క్రాష్ టెస్ట్ ప్రమాణాలను పాటిస్తున్నట్లు పేర్కొంది.
ముందు వైపు, ముందు వైపున మూలల్లో మరియు ప్రక్క వైపుల క్రాష్ టెస్టుకు సంభందించిన నూతన ప్రమాణాలను అక్టోబరు 1, 2017 నుండి విడుదలయ్యే కొత్త కార్లు ఖచ్చితంగా పాటించాలి, మరియు అక్టోబరు 1, 2019 నుండి భారత మార్కెట్లో ఉన్న అన్ని కార్లు కూడా ఈ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి.
అదే విధంగా పాదచారుల భద్రత పరమైన ప్రమాణాలను అక్టోబరు 1, 2018 నుండి విడుదలయ్యే ప్రతికారు పాటించాలి మరియు అక్టోబర్ 1, 2020 నాటికి అప్పటికే మార్కెట్లో ఉన్న మరియు అప్పటి నుండి విడుదలయ్యే ప్రతి మోడల్ కూడా ఈ ప్రమాణాలను పాటించాలని గడువు విధించారు.
ఈ నేపథ్యంలో, ఎస్-క్రాస్, సియాజ్, ఎర్టిగా, వితారా బ్రిజా, బాలెనో, డిజైర్, స్విఫ్ట్, ఇగ్నిస్ మరియు సెలెరియో ఉత్పత్తులు ఇప్పటికే ఫ్రంటల్, ఆఫ్-సెట్ ఫ్రంట్ మరియు సైడ్ క్రాష్ అదే విధంగా పెడస్ట్రైన్ (పాదచారి) క్రాష్ టెస్ట్ ప్రమాణాలను పాటిస్తున్నాయని వెల్లడించింది.
ప్రస్తుతానికి భద్రత ప్రమాణాలను పాటించని మిగతా ఆరు కార్లను గడువులోపు పూర్తి స్థాయిలో అభివృద్ది చేసి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపింది. మారుతి అతి త్వరలో సియాజ్ ఫేస్లిఫ్ట్ మరియు ఎర్టిగా ఫేస్లిఫ్ట్ మోడళ్లను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది.
భద్రత ప్రమాణాలను పాటించని వ్యాగన్ఆర్, ఆల్టో కె10 మరియు ఆల్టో 800 మోడళ్ల స్థానంలోకి అత్యున్నత నిర్మాణ విలువలు మరియు ప్రమాణాలను పాటించే కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్న సమచారం. అయితే, ఆమ్ని, ఇకో మరియు జిప్సీ మోడళ్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో నూతన భద్రత ప్రమాణాలు అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్తులో ఈ ప్రమాణాలను కఠినతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నికార్లు కూడా మెరుగైన ప్రమాణాలను పాటిస్తే రోడ్డు ప్రమాద మరణాల రేటు గణనీయంగా తగ్గిపోవడం ఖాయం.