Just In
- 1 hr ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 2 hrs ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 4 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 5 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
Don't Miss
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Movies Yuva Movie Collections పునీత్ రాజ్కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
నిస్సాన్ మరియు డాట్సన్ కార్లు ఇప్పుడు మరింత ప్రియం
నిస్సాన్ మరియు డాట్సన్ రెండు కంపెనీల కార్ల మీద ధరలు పెంచినట్లు నిస్సాన్ ఇండియా ప్రకటించింది. నిస్సాన్-డాట్సన్ కార్ల మీద గరిష్టంగా రెండు శాతం మేర ధరలు పెరిగాయి.
నిస్సాన్ మరియు డాట్సన్ రెండు కంపెనీల కార్ల మీద ధరలు పెంచినట్లు నిస్సాన్ ఇండియా ప్రకటించింది. నిస్సాన్-డాట్సన్ కార్ల మీద గరిష్టంగా రెండు శాతం మేర ధరలు పెరిగాయి. ధరల పెంపు అనంతరం సవరించబడిన నూతన ధరలు ఏప్రిల్ 1, 2018 నుండి అమల్లోకి వస్తాయి.
పెట్టుబడి ఖర్చులు పెరిగినందున్న నిస్సాన్ ఇండియా లైనప్లో లభించే అన్ని కార్ల మీద ధరలు పెంచింది. తయారీ భారాన్ని సమతుల్యం చేయడానికి స్వల్ప మేర ధరల పెంపు తప్పడంలేదని నిస్సాన్ పేర్కొంది.
నిస్సాన్ ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతానికి మైక్రా హ్యాచ్బ్యాక్, సన్నీ సెడాన్ మరియు టెర్రానో కాంపాక్ట్ ఎస్యూవీ ప్యాసింజర్ వాహనాలను విక్రయిస్తోంది. అదే విధంగా నిస్సాన్ ఇండియా భాగస్వామ్యపు సంస్థ డాట్సన్ గో మరియు రెడి-గో హ్యాచ్బ్యాక్ కార్లను అదే విధంగా గో ప్లస్ కాంపాక్ట్ ఫ్యామిలీ వ్యాగన్ కారును విక్రయిస్తోంది.
చివరిసారిగా, 2018 ఏడాది ప్రారంభంలో వివిధ మోడళ్ల ఆధారంగా గరిష్టంగా 15,000 రుపాయల వరకు ధరలు పెంచింది. పెట్టుబడి వ్యయం పెరగడం మరియు ముడి సరుకుల ధరలు పెరగడం అప్పట్లో ధరలు పెంచడానికి గల కారణమని నిస్సాన్ వివరించింది.
Recommended Video
నిస్సాన్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ జెరోమ్ సైగట్ మాట్లాడుతూ, "పెట్టుబడి ఖర్చులు పెరగడంతో అన్ని మోడళ్ల మీద ధరల పెంపు చేపట్టాము. ఈ నూతన ధరలు ఏప్రిల్ 1, 2018 నుండి దేశవ్యాప్తంగా ఉన్న నిస్సాన్ మరియు డాట్సన్ షోరూమ్ల ద్వారా అమల్లోకి వస్తాయని చెప్పుకొచ్చాడు."
నిస్సాన్ మాత్రమే కాదు, టాటా మోటార్స్ మరియు ఆడి ఇండియా కూడా దేశీయంగా విక్రయించే అన్ని కార్ల మీద వివిధ మోడల్ ఆధారంగా ధరలను పెంచాయి. సవరించిన కొత్త ధరలను ఏప్రిల్ 1, 2018 నుండి అమల్లోకి వస్తాయి. దిగుమతి వ్యయం పెరగడంతో ధరలు పెంచినట్లు ఆడి ఇండియా పేర్కొంది.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం నిస్సాన్ ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సార్లు ధరలు పెంపు చేపట్టింది. కొద్దిమేర మాత్రమే పెంచినప్పటికీ, ఈ ధరలు పెంపు ప్రభావం కార్ల విక్రయాల మీద పడే అవకాశం ఉంది. దేశీయ దిగ్గజం టాటా కూడా ధరలు పెంచడంతో మిగతా కంపెనీలు కూడా ఇదే బాటలో ధరలు పెంచడానికి సిద్దమయ్యాయి.
1. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 క్రిస్టల్ ఎడిషన్
2.భారీగా ధరలు పెంచిన టాటా మోటార్స్
3.2018 ట్రయంప్ టైగర్ 800 విడుదల: ధర రూ. 11.76 లక్షలు
4. మీ బైక్ మంచి మైలేజ్ ఇవ్వాలంటే చేయాల్సినవి మరియు చేయకూడనివి
5.ఈ ఎండాకాలంలో, మీ కారు ఏ/సి ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఇలా చేయండి!!