Just In
- 1 hr ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 4 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 5 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- 6 hrs ago మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
Don't Miss
- Lifestyle ప్రేమ విషయంలో ఈ రాశులను మాత్రం అస్సలు నమ్మకూడదు..నమ్మక ద్రోహం చేస్తారు..
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Movies Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తారా స్థాయికి చేరుకున్న పెట్రో ధరలు
దేశంలో పలు అన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్ మరియు డీజల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. చివరిసారిగా 2013లో గరిష్ట స్థాయిని చేరుకున్నాయి.
దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్ మరియు డీజల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. చివరిసారిగా 2013లో గరిష్ట స్థాయిని చేరుకున్నాయి. ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిన రోజు మారే ఇంధన ధరల కారణంగా పెట్రోల్ మరియు డీజల్ ధరలు రోజు రోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి.
కేంద్ర రాజధాని పరిధి ఢిల్లీలో ఇప్పుడు లీటర్ పెట్రో ధర రూ. 75.32 మరియు లీటర్ డీజల్ ధరర రూ. 66.79. సెప్టెంబర్ 2013 తరువాత నమోదైన అత్యధిక ధర ఇదే. ప్రస్తుతం ధోరణి ప్రకారం రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
దేశ ఆర్థిక రాజధానికి పేరుగాంచిన ముంబాయ్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.16 లతో తారా స్థాయికి చేరుకుంది. ఇదే ముంబాయ్ నగరంలో చివరి సారిగా సెప్టెంబరు 2013లో నమోదైన గరిష్ట ధర రూ. 83.62 లు. ప్రస్తుతం లీటర్ డీజల్ ధర రూ. 71.12 లు.
భారతదేశపు గ్రీన్ సిటీ బెంగళూరు ఈ విపరీతమైన ధరల పెంపుకు మినహాయింపు కాలేదు. బెంగళూరులో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 76.54 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 67.94 లుగా ఉంది.
చెన్నై నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 78.16 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 70.49 లతో తారా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అదే విధంగా కలకత్తాలో పెట్రోల్ ధర రూ. 78.01 లు మరియు డీజల్ ధర రూ. 69.33లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే రీతిలో పెరిగాయి. హైదరాబాదులో నేడు(17 మే 2018) లీటర్ పెట్రోల్ ధర రూ. 79.78లుగా మరియు గత నాలుగు రోజులుగా 79 రుపాయలుగా ఉంది. అదే విధంగా లీటర్ డీజల్ ధర రూ. 72 లుగా ఉంది.
గత వారం రోజులుగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్ మరియు డీజల్ ధరలను పెంచుతున్నాయి. ఈ ధరల పెంపులో విదేశీ కరెన్సీతో రుపాయి మారకం రేటు కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.
రాష్ట్ర ప్రభుత్వాలు విధించే అదనపు ట్యాక్స్ మినహాయిస్తే, దేశవ్యాప్తంగా ఇంధన ధరల విషయంలో ప్రభుత్వం ఎలాంటి పాత్ర పోషించడం లేదు. ప్రతి రోజు మారే ఇంధన ధరల విధానం అమల్లోకి రావడంతోనే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గతంలో ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా పునరావృతమయ్యేవి.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
2013లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో నగరాల్లో ఇంధన ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో పెరుగుతున్న ఇంధన ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. పెట్రోల్తో పాటు డీజల్ ధరలు కూడా అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్నాయి.
పెరిగిన పెట్రోల్ మరియు డీజల్ ధరలు క్రిందకు దిగివచ్చే అవకాశాలు దాదాపు తక్కువగానే ఉన్నాయి. కాబట్టి, ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడం ఎంతో ఉత్తమం.