Just In
- 4 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 5 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 6 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 7 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Movies విడాకులు దిశగా మరో స్టార్ కపుల్.. ఇండస్ట్రీలో షాకింగ్గా..!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కమర్షియల్ వాహనాలపై సంచలన నిర్ణయం తీసుకోనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యం నివారించడానికి కేంద్ర ప్రభుత్వం వాహనాలపై ఎన్నో ఆంక్షలు విధించింది. వాటిలో ముఖ్యంగా బిఎస్-6 ఇంజిన్ కలిగిన వాహనాలు 2020 కల్లా మరియు ఎలక్ట్రిక్ వాహనాలు 2022 కల్లా ఉండలని సూచించింది. దీనికి తగ్గట్టుగానే పావులు కదుపుతోంది. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన చర్యలను తీసుకొంటున్నాయి. అయితే తాజాగా ఏపి ప్రభుత్వం ముందు కూడా ఒక సవాలు ఉంది అదేమిటో వివరంగా తెలుసుకొందాం రండి..
విశాఖపట్నం నగరంలో వాయు కాలుష్యానికి చెక్ పెట్టే ప్రయత్నంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి 15 ఏళ్ల వాణిజ్య డీజిల్ వాహనాల వాడకాన్ని నిరోధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
భారతదేశంలోని టాప్ కాలుష్య నగరాల జాబితాలో విశాఖపట్నం ఉంది, దీనిని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) ఇటీవల ప్రకటించింది.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిశీలనల ప్రకారం, పిఎమ్10 యొక్క పరిసర ప్రాంతాలలో గాలి యొక్క నాణ్యత నగర తాజా సగటు గణాంకాల ప్రకారం 60 యొక్క జాతీయ విలువ కాగా, అయితే కొన్ని నగరాలలో దీనికి వ్యతిరేకంగా 76గా ఉంది.
ముఖ్యంగా విశాఖపట్నం పోర్టుకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు 80 కంటే పిఎమ్10 వార్షిక విలువను కలిగి ఉన్నాయి. ఇక్కడ పిఎమ్10 అంటే పర్టికులర్ మేటర్, దీనిని వాతావరణ కాలుష్య వివరణలతో ఉపయోగిస్తారు.
పిఎమ్10 స్థాయి 76 దాటకుండా ధృవీకరించడానికి, APPCB ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది మరియు RTA సహా మొత్తం ఏడు విభాగాలకు పంపిణీ చేసింది. డిసెంబర్, 2019 కంటే ముందే ఈ నిబంధనను అమలు చేయాలని కూడా బోర్డు సూచించింది.
ఈ ప్లాన్ లో, 15 సంవత్సరాల కంటే ఎక్కువ పాత కమర్షియల్ డీజిల్ వాహనాలను నిషేధించాలని కాలుష్య నియంత్రణ మండలి, ఏపి ప్రభుత్వాన్ని కోరింది అని సమాచారం.
Most Read: భారత దేశంలోని రాష్ట్ర పోలీస్ ఫోర్స్ ఉపయోగించే ఆధునిక కార్లు ఇవే
ట్రక్కులు, ప్యాసింజర్ బస్సుల వంటి పెద్ద రవాణా వాహనాల రిజిస్ట్రేషన్లను ప్రతి రెండేళ్లకు ఒకసారి పునరుద్ధరిం చాలని సీనియర్ ట్రాన్స్ పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు. కానీ ప్రైవేటు వాహనాల విషయానికి వస్తే రెన్యువల్ కాలం 15 సంవత్సరాలు ఉంటుందని తెలియచేసారు.
Most Read: బన్నీ లేటెస్ట్ లగ్జరీ రేంజ్ రోవర్.. ధర ఎంతో తెలుసా
"అయితే నగరాలలో కనీసం 5% కార్లు మరియు 5% మోటార్ సైకిళ్ళ 15 సంవత్సరాల పాతవి ఉన్నాయని, 15 సంవత్సరాల కంటే ఎక్కువ పాతబడి ఉన్న పెద్ద వాహనాలు నగరంలో ఇంకా తిరుగుతున్నాయని వీటిని నిషేధించాలని కాలుష్య నియంత్రణ మండలి కోరింది.
Most Read: క్రాష్ గార్డ్ ఉన్న వాహనాలపై భారీ జరిమానా : హైదరాబాద్ పోలీస్
కానీ వీటిని రద్దు చేయాలంటూ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఆదేశాలు రాలేదు. కాలుష్య నియంత్రణ మండలి సూచనపై ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది " అని రవాణాశాఖ అధికారి తెలిపారు.
Source:Indiatimes