Just In
- 1 hr ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 2 hrs ago
కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- 3 hrs ago
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- 1 day ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
Don't Miss
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- News
ఏపీలో టెన్షన్, టెన్షన్- మొదలుకాని నామినేషన్లు- ఎస్ఈసీ ఆఫీసులోనే నిమ్మగడ్డ
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Movies
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కమర్షియల్ వాహనాలపై సంచలన నిర్ణయం తీసుకోనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యం నివారించడానికి కేంద్ర ప్రభుత్వం వాహనాలపై ఎన్నో ఆంక్షలు విధించింది. వాటిలో ముఖ్యంగా బిఎస్-6 ఇంజిన్ కలిగిన వాహనాలు 2020 కల్లా మరియు ఎలక్ట్రిక్ వాహనాలు 2022 కల్లా ఉండలని సూచించింది. దీనికి తగ్గట్టుగానే పావులు కదుపుతోంది. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన చర్యలను తీసుకొంటున్నాయి. అయితే తాజాగా ఏపి ప్రభుత్వం ముందు కూడా ఒక సవాలు ఉంది అదేమిటో వివరంగా తెలుసుకొందాం రండి..

విశాఖపట్నం నగరంలో వాయు కాలుష్యానికి చెక్ పెట్టే ప్రయత్నంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి 15 ఏళ్ల వాణిజ్య డీజిల్ వాహనాల వాడకాన్ని నిరోధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

భారతదేశంలోని టాప్ కాలుష్య నగరాల జాబితాలో విశాఖపట్నం ఉంది, దీనిని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) ఇటీవల ప్రకటించింది.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిశీలనల ప్రకారం, పిఎమ్10 యొక్క పరిసర ప్రాంతాలలో గాలి యొక్క నాణ్యత నగర తాజా సగటు గణాంకాల ప్రకారం 60 యొక్క జాతీయ విలువ కాగా, అయితే కొన్ని నగరాలలో దీనికి వ్యతిరేకంగా 76గా ఉంది.

ముఖ్యంగా విశాఖపట్నం పోర్టుకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు 80 కంటే పిఎమ్10 వార్షిక విలువను కలిగి ఉన్నాయి. ఇక్కడ పిఎమ్10 అంటే పర్టికులర్ మేటర్, దీనిని వాతావరణ కాలుష్య వివరణలతో ఉపయోగిస్తారు.

పిఎమ్10 స్థాయి 76 దాటకుండా ధృవీకరించడానికి, APPCB ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది మరియు RTA సహా మొత్తం ఏడు విభాగాలకు పంపిణీ చేసింది. డిసెంబర్, 2019 కంటే ముందే ఈ నిబంధనను అమలు చేయాలని కూడా బోర్డు సూచించింది.

ఈ ప్లాన్ లో, 15 సంవత్సరాల కంటే ఎక్కువ పాత కమర్షియల్ డీజిల్ వాహనాలను నిషేధించాలని కాలుష్య నియంత్రణ మండలి, ఏపి ప్రభుత్వాన్ని కోరింది అని సమాచారం.
Most Read: భారత దేశంలోని రాష్ట్ర పోలీస్ ఫోర్స్ ఉపయోగించే ఆధునిక కార్లు ఇవే

ట్రక్కులు, ప్యాసింజర్ బస్సుల వంటి పెద్ద రవాణా వాహనాల రిజిస్ట్రేషన్లను ప్రతి రెండేళ్లకు ఒకసారి పునరుద్ధరిం చాలని సీనియర్ ట్రాన్స్ పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు. కానీ ప్రైవేటు వాహనాల విషయానికి వస్తే రెన్యువల్ కాలం 15 సంవత్సరాలు ఉంటుందని తెలియచేసారు.
Most Read: బన్నీ లేటెస్ట్ లగ్జరీ రేంజ్ రోవర్.. ధర ఎంతో తెలుసా

"అయితే నగరాలలో కనీసం 5% కార్లు మరియు 5% మోటార్ సైకిళ్ళ 15 సంవత్సరాల పాతవి ఉన్నాయని, 15 సంవత్సరాల కంటే ఎక్కువ పాతబడి ఉన్న పెద్ద వాహనాలు నగరంలో ఇంకా తిరుగుతున్నాయని వీటిని నిషేధించాలని కాలుష్య నియంత్రణ మండలి కోరింది.
Most Read: క్రాష్ గార్డ్ ఉన్న వాహనాలపై భారీ జరిమానా : హైదరాబాద్ పోలీస్

కానీ వీటిని రద్దు చేయాలంటూ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఆదేశాలు రాలేదు. కాలుష్య నియంత్రణ మండలి సూచనపై ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది " అని రవాణాశాఖ అధికారి తెలిపారు.
Source:Indiatimes