Just In
- 7 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 8 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 9 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 10 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పార్కింగ్ కార్లు పై యాసిడ్ దాడులు.....జాగ్రతగా ఉండండి..!
కార్లపై కొత్త గా యాసిడ్ దాడులు జరుగుతున్నాయి,ఈ సంఘటనలు చాలా షాక్ కు గురిచేస్తున్నాయి.మీకు దీని గురించి వివరణాత్మక సమాచారాన్ని ఇక్కడ పొందవచ్చు.
వీధి,రోడ్లు లలో కూడా కారు పై చేసే విధ్వంస కేసులు ఉన్నాయి,ప్రత్యేకంగా ఖరీదైన వాహనాలపై ఇవి జరగడం అత్యంత సాధారణమై పోయేది. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో కారును నాశనం చేయడానికి ఒక కొత్త మార్గం వచ్చింది, దీనితో కొన్ని వాహనాల పై దాడి జరిగింది అది ఏమిటంటే.
కార్లు మీద యాసిడ్ దాడి
ఢిల్లీలోని నాగరిక నివాస స్థలంలో ఉన్న కొన్ని కార్ల పై, రాత్రిపూట ఆసిడ్ లేదా కొన్ని ఇతర రసాయనాలతో దాడి చేస్తున్నారు.ఈ దాడికి గురి ఆయన వాటిలో మినీ కూపర్ ఎస్, టాటా టిగోర్, హ్యుందాయ్ క్రేటా వంటి వాహనాలపై చేశారు.
దాడి వెనుక ఉన్న వాస్తవ కారణం తెలియదు కానీ , ఇది పార్కింగ్ వివాదం కావచ్చు.CCTV కెమెరాలను పార్కింగ్ స్లాట్లో ఏర్పాటు చేయబడ్డాయి,ఢిల్లీలో పరిమిత స్థలం కారణంగా, చాలామంది నివాసితులు రహదారులపై స్థిరమైన పార్కింగ్ స్థలాన్ని ఉండవు.
యాసిడ్ లేదా ఇతర రకమైన రసాయనాలతో దాడిచేసిన కార్ల పెయింట్ను బయటకు రావడం చూడవచ్చు. దాడి చేసేవారు వాహనాన్ని నష్టపరిచారు కాని వాహనాల పైకప్పుపై కేవలం ద్రవాన్ని చల్లారు.
ఆధునిక వాహనాలు అలారంను గల సెన్సార్లతో కూడినవి కనుక, దాడి చేసేవారు వాహనాలను నాశనం చేయకుండా కొత్త మార్గంను ఎన్నుకోవాలి దీని వలన కారుపై ఆసిడ్ చల్లడం జరిగిన ఎటువంటి అలారం హెచ్చరిక ఉండదు.
దాడిచేసేవారు ఉపయోగించే ద్రవము తెలియదు కానీ యాసిడ్ కాకుండా,దాడి చేసేవారు కేవలం పెయింట్ తొలగింపు చేసే విధంగ స్ప్రేలు లేదా ఇతర ద్రవాలను ఉపయోగించివుండవచు,
ఎటువంటి రసాయనాలు ఏ ఇబ్బందులు లేకుండా మార్కెట్లలో మరియు ఆన్లైన్లో సులభంగా అందుబాటులో ఉంటాయి.ఇటువంటి నష్టాన్ని సరిచేయడానికి తిరిగి రంగులు వేయడం తప్ప వేరే మార్గం లేదు.
అయితే, ఢిల్లీ లాంటి ఇరుకైన నగరాలలో, స్థలం ప్రధాన సమస్యగా ఉంది చాలా కుటుంబాలు ఒకటి కంటే ఎక్కువ కారు కలిగివున్నాయి, ఇది వాహనాలను పార్క్ చేయడానికి సురక్షిత స్థలాన్ని మరింత కష్టతరం చేస్తుంది.
సిరామిక్ అనే రసాయనం ఇటువంటి నష్టాన్ని కలిగిస్తుంది, అందువల్ల పూత ఎలాంటి రసాయనాలు నుండి వాహనం యొక్క పెయింట్ను ప్రభావితం చేయడంలో సహాయం చేస్తుందో లేదో చెప్పలేము. అలాగే, ప్లాస్టిక్ బాడీ కవర్లు ఇటువంటి ద్రవాలకు తట్టుకోలేవు
Most Read: 56 రూపాయల కోసం....ఎపి మంత్రి గారి భార్య నిర్వాకం,ఎంత దారుణం:[వీడియో]
మీరు నేరస్థులను ఎలా గుర్తించగలరు?
వివిధ కోణాల్లో పార్కింగ్ ప్రాంతాలు చుట్టూ CCTV కెమెరాలు ఇన్స్టాల్ చేయడం ఇటువంటి వాటిని గుర్తించడానికి ఏకైక మార్గం. అంతేకాక, మార్కెట్లో ఉన్న హై-టెక్ డాష్బోర్డ్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి,
Most Read: ఈ పుస్తకం ఖరీదు ఒక కోటి 80 లక్షలు.. ఇంతకీ ఆ బుక్కులో ఏముంది?
ఇవి వెంటనే మోషన్గా పని చేస్తాయి. అటువంటి డాష్బోర్డ్ కెమెరాలు ముందు భాగంలో మౌంట్ మరియు వెనుక విండ్ స్క్రీన్లు అమర్చడం ద్వారా అపరాధులను గుర్తించడానికి సహాయపడతాయి.
Most Read: మహీంద్రా స్కార్పియోని లాగేసిన యమహా....మీరు ఈ వీడియోని చూస్తే నమ్మరు!!
ఇన్సూరెన్స్ డబ్బు?
విధ్వంసక చర్యలపై చాలా భీమా పాలసీలు ఉంటాయి కానీ స్పష్టత,ఇతర వివరాలు కోసం పాలసీని తనిఖీ చేయాలి. అయితే, సమీపంలోని పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైతే తప్ప ఇన్సూరెన్క్ దరఖాస్తు చేయలేరు.
భీమా సంస్థలు తరచుగా ఇటువంటి తీవ్రమైన సందర్భాల్లో ఎఫ్ఐఆర్ ని అడుగుతారు. ఢిల్లీలో ఇలాంటి దాడులు జరగడం ఇది మొదటిసారి కాదు.గతంలోవారి పార్కింగ్ వాహనాలపై ఇలాంటి దాడులు జరిగాయని తెలిసింది.
Source:Team-BHP