Just In
- 5 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 6 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 7 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 8 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
19 లక్షల నిస్సాన్ కారును కేవలం రూ.2 లక్షలకే కొట్టేసిన ఘనుడు.....!
కేవలం 2 లక్షల రూపాయలకే నిస్సాన్ కిక్స్ కొన్నాడు, అలా అనుకొంటే మీరు పప్పులో కాలు వేసినట్టే ఎందుకంటే ఒక అతను డౌన్ పేమెంట్ చెల్లించి పూజ చేయిస్తానని చెప్పి మరీ యజమానిని నమ్మించి కార్ తీసుకుపోయాడు.
బెంగళూరులో నిస్సాన్ షోరూమ్ లో జరిగిన యధార్థ సంఘటన, రూ.18.6 లక్షల విలువ గల కారును కేవలం రూ. 2 లక్షల రూపాయలకు ఇచ్చి తీసుకుపోయాడు ఒక ప్రబుద్దుడు, వివరాలలోకి వెళితే..
జోస్ థామస్ అకా జోసెఫ్ అనే కస్టమర్ నిస్సాన్ కిక్స్ వాహనం కోసం షో రూంకి వెళ్ళాడు, అక్కడ నిస్సాన్ కిక్స్ కార్ వివరాలను తెలుసుకొన్నాడు,
ఆ కార్ ధర రూ 18.6 లక్షలు అని చెప్పగానే రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ కట్టిన తరువాత పూజ చేయించుకుంటానని చెప్పి కారును తీసుకెళ్లాడు.ఇక అంతే అక్కడ నుంచి కనిపించకుండా పోయాడు.
ఎన్ని సార్లు ఫోన్లు చేసినా సమాధానం లేదు.నిందితుని ఆఫీసుకు వెళ్లి అరా తీసిన ఫలితం దక్కలేదు,చివరికి పోలీసులను ఆశ్రయించిన తరువాత తెలిసిన విషయం ఏమిటంటే ఈ ఘటన జరిగి నాలుగు నెలలైంది.
ఈ సంఘటన జనవరి 23న బెంగళూరు నగరంలోని దొడ్డనెకుంది వద్ద ఉన్న సూర్య నిస్సాన్ షోంరూంలో జరిగింది. అయినప్పటికీ, షోరూమ్ మేనేజర్ HAL పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులకు ఫిర్యాదు చేశారు,
Most Read: ట్యూబ్లెస్ టైర్ల కథ ముగిసింది వాటి స్థానంలో ఎయిర్ లెస్ టైర్ల వచ్చేస్తున్నాయ్ !
దాదాపు నాలుగు నెలల తరువాత(మే 21న) షోరూం యజమాని గణేశ్ కుమార్ శెట్టి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ ఫిర్యాదు గురువారం మహాదేవురాపు పోలీసు స్టేషన్కు బదిలీ అయింది.
Most Read: 150సిసి ద్విచక్ర వాహనాలను నిషేధించనున్న భారత ప్రభుత్వం...!
మేనేజర్ గణేష్ కుమార్ శెట్టి మాట్లాడుతూ, జనవరి 23 న ఉదయం 6:30 గంటలకు నిస్సాన్ కిక్స్ వాహనం గురించి అడిగిన షోరూమ్ కి జోస్ థామస్ అలియాస్ జోసెఫ్ అనే వ్యక్తి వచ్చారని తెలిపాడు, తరువాత ఇలా జరిగింది అని చెప్పాడు.
Most Read: జగనన్నపై ఎల్లలుదాటిన అభిమానం....చట్ట ఉల్లంఘనపై వివాదం ...!
ఇంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేశారని అడిగితే దానిపై గణేష్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. గణేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకునిన తరువాత డిసిపి అబ్దుల్ అహద్ దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.
ఈ ఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత ఫిర్యాదు చేసినందున కేసు దర్యాప్తునకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని,నిందితుడు ఇచ్చిన ఫోన్ నెంబర్, ఆఫీస్ అడ్రస్ వివరాలను సేకరించామని డిసిపి తెలిపారు.
Source: Thenewsminute