Just In
- 38 min ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 2 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 3 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
- 4 hrs ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
Don't Miss
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Movies Tillu Square: శ్రీలీల సహా అనుపమ క్యారెక్టర్ మిస్ చేసుకున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా?
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల యొక్క అమ్మకాల పరిస్థితి
భారతదేశం నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది. ఈ విధంగా అభివృద్ధి జరుగుతున్న తరుణంలో జరిగిన మరియు జరుగుతున్న మార్పులు ఎన్నెన్నో ఉన్నాయి. ప్రధానంగా అభివృద్ధి అంటే మనకు గుర్తుకు వచ్చేది మొదట రవాణా వ్యవస్థ. మొదట డీజిల్ వాహనాలు ,తరువాత కాలంలో పెట్రోల్ వాహనాలు వచ్చాయి. కానీ ఇప్పుడు విద్యుత్ సహాయంతో నడిచేకారు భారతదేశంలో రంగప్రవేశం చేసాయి. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలలోలాగా మనం కూడా ఇటువంటి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు వినియాగం ఎంతైనా అవసరం.
ఇప్పుడు ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల యుగం ప్రారంభమైంది. 2019 ఏప్రిల్ నుండి 2019 అక్టోబర్ వరకు ఏడు నెలలపాటు అమ్మిన ఎలక్ట్రిక్ కార్ల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఎలక్ట్రిక్ కార్లవల్లా పర్యావరణం సురక్షితంగా ఉంటుంది. శిలాజ ఇంధనాల కొరత ఉండదు. రాబోయే తరాలకు ఎటువంటి నష్టము ఉండదు.
కాబట్టి వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నంలో బ్యాటరీతో నడిచే కార్లను ప్రవేశపెట్టారు. ఇప్పుడు వాహనాలను తయారుచేసే పెద్దపెద్ద కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడంపై ద్రుష్టి సాగిస్తున్నారు.
మనదేశంలో ఈ ఆర్ధిక సంవత్సరంలో 16,05,549 ఎలక్ట్రిక్ కార్లలో కేవలం 1071 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దేశం మొత్తం మీద ఎలక్ట్రిక్ వాహనాలు 0.067% మాత్రమే అమ్ముడయ్యాయి అని తెలుస్తుంది.
ఎలక్ట్రిక్ వాహనాలను బాగా వ్యాప్తిలోకి తీసుకురావాలని, తీసుకురావడానికి కావలసిన సహాయ సహకారాలను ప్రభుత్వం కూడా అందిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితీష్ గడ్కరీ చెప్పారు. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగ దారులు ఎంతైనా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ ఆర్ధిక సంవత్సరంలో భారతదేశంలో అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనాలు ఈ విధంగా ఉన్నాయి.
ర్యాంక్ | మోడల్స్ | 2019 ఏప్రిల్-అక్టోబర్ |
1 | మహీంద్రా - వెరిటో | 434 |
2 | టాటా - టిగోర్ | 389 |
3 | హ్యుందాయ్ - కోన | 227 |
4 | మహీంద్రా - ఇ2ఓ | 21 |
1) 2019 ఆర్ధిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు "వెరిటో". దీని సగటు 62 కార్లు
2) టైగర్ 7 నెలల వ్యవధిలో 389 కార్లను విక్రయించింది మరియు దాని సగటు 56 కార్లు.
3) కోనా మంచి పురోగతి సాధించింది మరియు ప్రారంభించిన 5 నెలల్లో 227 యూనిట్లను విక్రయించింది మరియు సగటున 45 యూనిట్లు.
4) E2O ఫస్ట్ మూవర్ ప్రయోజనాన్ని పూర్తిగా కోల్పోయింది. ప్రస్తుతం ఈ మోడల్ యొక్క సగటు అమ్మకం 3 కార్లు మాత్రమే.
Read More:2 సంవత్సరాల వారంటీని 4 సంవత్సరాలకు పెంచిన రాయల్ ఎన్ఫీల్డ్!
ఎలక్ట్రిక్ కార్లు వినియోగానికి కావలసిన అన్ని సదుపాయాలను కంపెనీలు సమకూరుస్తున్నాయి. నగరాలలో ఛార్జింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్లు చూడటానికి ఆకర్షంగా ఉండటమే కాకుండా మంచి మైలేజ్ కూడా ఇస్తుంది. కాబట్టి వినియోగ దారులు నిస్సంకోచంగా ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించుకోవచ్చు.
Read More:భారతదేశం నుండి దక్షిణాఫ్రికాకు ఎగుమతవుతున్న రెనాల్ట్ ట్రైబర్!