Just In
- 3 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 5 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 8 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 9 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఎలక్ట్రిక్ వాహనాల జీఎస్టీ పై కేంద్రం సంచలన నిర్ణయం
విద్యుత్ వాహనాల కొనుగోలుదారులకు త్వరలో శుభవార్త అందనున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ నెల 25వ తేదీన జరుగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో విద్యుత్తో నడిచే వాహనాలపై సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అది ఏమిటో వివరంగా తెలుసుకొందాం రండి..
ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) రేట్లను తగ్గింపుతో ముందుకు సాగాలని నిర్ణయించింది. భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల జీఎస్టీ రేట్లు త్వరలో 12 శాతం నుంచి 5 శాతానికి దిగిరాబోతున్నాయి.
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రోత్సహించటానికి ఎన్ డిఎ-ప్రభుత్వం తన ప్రణాళికల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తోంది.
కొన్ని రాష్ట్రాలు తమ ఆందోళనను వ్యక్తం చెప్పినప్పటికీ, భారత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని తగ్గించేందుకు ఈ కమిటీ ఆమోదం తెలిపింది.
కేంద్ర బడ్జెట్ 2019 కూడా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల చైతన్యం దిశగా సాగేందుకు ప్రోత్సహించేందుకు పలు కొత్త చర్యలను చేపట్టింది. ఈ విధంగా చేయడం వలన తయారీదారులకు మరియు కొనుగోలుదారులకు పన్ను ప్రయోజనాలు కలిగించడం ద్వారా కొత్త ప్రోత్సాహకాలను అదనంగా ఇస్తున్నారు.
టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి
దీని ప్రణాళికల్లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు తీసుకున్న రుణాల వడ్డీరేట్లపై రూ. 1.5 లక్షల వరకు అదనపు ఆదాయపు పన్ను మినహాయింపులను కూడా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే, విద్యుత్ వాహనాల చైతన్యం దిశగా తీసుకున్న చర్యలను మరింత పటిష్టం చేస్తూ, పరోక్ష పన్ను వైపు కూడా పన్ను మార్పులను చేయాలనే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోంది.
జీఎస్టీ తగ్గింపులు కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే పరిమితం కాకుండా ఉంటాయని కూడా అధికారులు పేర్కొన్నారు. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్స్ పై కూడా జీఎస్టీని తగ్గించాలని కమిటీ యోచిస్తోంది.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ ఛార్జర్స్ కు 18 శాతంగా ఉన్న జీఎస్టీ, త్వరలోనే 12 శాతానికి తగ్గించే అవకాశముంది, దీనివలన భారతదేశంలో గ్రీనర్ మొబిలిటీ సొల్యూషన్స్ దిశగా అడుగు వేయడానికి మరింత ప్రోత్సహాన్ని కలిగిస్తోంది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ కొరకు నీతి ఆయోగ్, ఇప్పటికే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొరకు ఒక నమూనాను ప్లాన్ చేసింది. వారి ప్రణాళికల ప్రకారం 2030 తర్వాత భారత్ లో విక్రయించిన వాహనాలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలగా ఉంటాయి.
అన్ని ప్రైవేట్ టూ వీలర్ మరియు ఫోర్ వీలర్లు 2023 నాటికి విద్యుత్ వాహనాలుగా, వాణిజ్య వాహనాలు 2026 నుండి విద్యుత్ వాహనాలుగా కలిగి ఉంటాయని కూడా ఈ నమోనాలలో పేర్కొంటోంది.