Just In
- 11 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 12 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 13 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 14 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Movies Guppedantha Manasu March 29th: మను ఇక్కడే ఉంటాడంటున్న వసు.. వద్దంటూ గొడవ చేస్తున్న అనుపమ!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వాహనదారులకు శుభవార్త..ఇథనాల్ ఇంధన కేంద్రాలు రాబోతున్నాయి
రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తన కార్యాలయంలో భారత ఇథనాల్ ఆర్థిక వ్యవస్థను రూ .2 లక్షల కోట్లతో వ్యయంతో దేశవ్యాప్తంగా ఇథనాల్ ఇంధన స్టేషన్లను ఏర్పాటు చేయాలని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖను కోరనున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా చెరకు రైతులకు అవకాశాలను తెరుస్తుందని మరియు వ్యవసాయ రంగంలో ఉద్యోగాలను సృష్టిస్తుందని గడ్కారీ భావిస్తున్నాడు. భారతదేశపు మొట్టమొదటి ఇథనాల్-శక్తితో నడిచే మోటార్ సైకిల్ టివిఎస్ అపాచీ ఆర్టిఆర్ 200 ఎఫ్ఐ ఈ100 ను ప్రారంభించారు.
ఈ ప్రారంభ సమయంలో గడ్కారీ పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖను, ఇథనాల్ ఆధారిత ఇంధన కేంద్రాలను నిర్మించటానికి అనుమతించమని పేర్కొన్నాడు, ఎందుకంటే భారత్ కు ఇథనాల్ తయారీకి భారీ అవకాశాలున్నాయి.
ఇథనాల్ ఎకానమీ గత ఏడాది (ఎఫ్వై 2018-19) రూ. 11,000 కోట్ల వద్ద నిలవగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 20,000 కోట్లకు పెరుగుతుందని అంచనా. కేంద్ర మంత్రి గడ్కారీ తన కార్యాలయంలో ఈ రంగాన్ని రూ .2 లక్షల కోట్లతో అభివృద్ధి చేయాలనే లక్ష్యం పెట్టుకొన్నట్టు చెప్పారు.
మంత్రి గడ్కారీ మాట్లాడుతూ...' రైతులకు రూ .2 లక్షల కోట్లుతో వ్యవసాయ రంగానికి కూడా మరింత ఉపాధిని కలిగిస్తుంది, దేశీ దిగుమతి బిల్లును తగ్గించి, దేశ జీడీపీకి దోహదం చేస్తుంది.'
టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి
"గత 12 సంవత్సరాల నుంచి, 100% బయో ఇథనాల్ పై నడిచే వాహనాలను తయారు చేయడం కొరకు నేను భారతీయ ఆటో పరిశ్రమలను అనుసరిస్తున్నాను. మన ముడి చమురు దిగుమతి చేయడానికి రూ .7 లక్షల కోట్లకుపైగా వెచ్చిస్తున్నారు. అదే సమయంలో కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్నాం.
కాలుష్య సమస్య గురించి ప్రజలను, ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నవారిని ఒప్పించవలసిన అవసరం మాకు లేదు. ఇప్పుడు మనం కాలుష్య సమస్యను పరిష్కరించడానికి సమయం ఉంది, "అని ఆయన తెలిపారు.
దేశంలో ఇథనాల్ తయారీకి సరిపడా సాంకేతిక పరిజ్ఞానం ఉందని, కాలుష్యంతో పోరాడే ఈ సామర్థ్యాన్ని తప్పక ఉపయోగించుకోవడం ఖాయమని మంత్రి భావిస్తున్నట్టు సమాచారం.
ఆటోమొబైల్ తయారీదారులు ఇథనాల్ ను ఇంధనంగా ఉపయోగించడానికి టెక్ అభివృద్ధి చెందకపోవడం వల్ల పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వశాఖ, ఇథనాల్ ఇంధన కేంద్రాలు యొక్క అభివృద్ధి చేయడానికి అనుమతించడానికి సుముఖంగా లేదని కూడా ఆయన చెప్పారు.
"వెంటనే ఆ నోట్ ని పెట్రోలియం మంత్రిత్వశాఖకు తరలించండి, అలాగే దీనిని నితి ఆయోగ్ బోర్డుకు తీసుకెళ్లండి," అని గడ్కారీ తెలిపారు. ఇథనాల్ ను ఇంధనంగా వినియోగించి ప్రస్తుతం తేలికైన రాకెట్ ఆధారిత రేసింగ్ ఎయిర్ క్రాఫ్ట్ లలో ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. ఒక లీటర్ పెట్రోలు జాతీయ సరాసరి రూ. 72 ధరతో పోలిస్తే ఇథనాల్ రిటైల్స్ లీటర్ కు రూ. 52 ధర ఉంటుంది.